చిరంజీవి, ప‌వ‌న్‌పై కేఏ పాల్ వివాదాస్పద వ్యాఖ్య‌లు

చిరంజీవి, ప‌వ‌న్‌పై కేఏ పాల్ వివాదాస్పద వ్యాఖ్య‌లు

ప్ర‌జాశాంతి పార్టీ వ్య‌వ‌స్థాప‌క అధ్య‌క్షులు కేఏ పాల్ చిరంజీవి, ప‌వ‌న్ కళ్యాణ్‌పై వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు. సిగ్గులేని కాపులు చాలా మంది ఉన్నారంటూ రెచ్చిపోయారు. ప‌ద‌వి కోస‌మే ప‌వ‌న్ క‌ళ్యాణ్ టీడీపీ-బీజేపీతో అంట‌కాగుతున్నాడ‌ని ఆరోపించారు.

ప్ర‌జారాజ్యం పార్టీని స్థాపించిన చిరంజీవి, సిగ్గులేకుండా పార్టీని కాంగ్రెస్ పార్టీలో ప్యాకేజీ కోసం విలీనం చేశాడ‌ని, అప్పుడు కూడా ప‌వ‌న్ క‌ళ్యాణ్ కాంగ్రెస్‌కు ప్యాకేజీ స్టార్ అయిపోయాడ‌ని, మ‌ళ్లీ ఇప్పుడు ప‌ద‌వి కోసం టీడీపీ-బీజేపీ బానిస‌గా త‌యార‌య్యాడ‌ని వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు కేఏ పాల్‌.

అంత‌టితో ఆగ‌కుండా ప‌వ‌న్ క‌ళ్యాణ్ పేరు ఎత్తుతూ కొంత‌మంది హంగామా చేస్తున్నార‌ని, రాష్ట్రాన్ని అమ్మేసే వారి పేరు ఎందుకు ప్ర‌స్తావిస్తున్నారంటూ వ్యాఖ్యానించారు. డిప్యూటీ సీఎం గారి తాలూకా అని ఎందుకు రాసుకుంటున్నార‌ని ప్ర‌శ్నించారు. వారంతా ప‌వ‌న్‌కు బుద్ధి చెప్పి కేఏ పాల్‌తో జాయిన్ అవ్వాల‌ని స‌ల‌హా ఇవ్వాల‌ని కోరారు. ఏపీ ప‌ర్య‌ట‌న‌కు మోదీ వ‌చ్చిన‌ప్పుడు స‌భ‌లో ప‌వ‌న్ క‌ళ్యాణ్ అని అర‌వాల‌ని ప్ర‌జ‌ల‌కు మేసేజ్‌ల రూపంలో ఆర్డ‌ర్స్ పంపించార‌ని ఆరోపించారు. ప్ర‌స్తుతం కేఏ పాల్ వ్యాఖ్య‌లు తీవ్ర చర్చ‌నీయాంశంగా మారాయి. మ‌రి దీనిపై ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, జ‌న‌సేన పార్టీ విధంగా స్పందిస్తుందో చూడాలి.

Join WhatsApp

Join Now

Leave a Comment