పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘రాజాసాబ్’ (Rajasab). ఈ చిత్రం మారుతి (Maruti) దర్శకత్వంలో హారర్ కామెడీ డ్రామాగా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో ప్రభాస్తో పాటు మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ది కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు సినిమాపై భారీ అంచనాలను కలిగించాయి. అభిమానులు ఈ చిత్ర అప్డేట్స్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
తాజాగా, చిత్ర యూనిట్ ‘రాజాసాబ్’ రిలీజ్ డేట్ను ప్రకటించింది. ఈ సినిమాను డిసెంబర్ 5, 2025న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు తెలిపారు. అలాగే, ఈ నెల 16న టీజర్ రిలీజ్ చేస్తూ, ప్రభాస్ లుక్తో కూడిన కొత్త పోస్టర్ను విడుదల చేశారు. ప్రభాస్ నుంచి మొదటిసారి హారర్ నేపథ్యంలో వస్తున్న చిత్రం కావడంతో అందరి దృష్టి ఈ మూవీపైనే ఉంది.
ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ (People Media Factory) బ్యానర్ (Banner)పై టి.జి.విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. అయితే, ఈ సినిమా కోసం ప్రభాస్ తన రెగ్యులర్ రెమ్యునరేషన్ (Remuneration) రూ.150 కోట్లకు బదులు రూ.100 కోట్లు మాత్రమే తీసుకుంటున్నట్లు సమాచారం. గతంలో ప్రభాస్ నటించిన ‘ఆదిపురుష్’ చిత్రం వల్ల ఈ నిర్మాతకు భారీ నష్టం వాటిల్లిన నేపథ్యంలో, ప్రభాస్ రూ.50 కోట్లు తగ్గించి నిర్మాతకు మద్దతుగా నిలిచినట్లు తెలుస్తోంది. ఈ విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.