పింక్ బుక్ మెయిన్‌టైన్ చేస్తున్నాం.. ఎమ్మెల్సీ కవిత

పింక్ బుక్ మెయింటైన్ చేస్తున్నాం.. ఎమ్మెల్సీ కవిత

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అధికార పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. హైదరాబాద్‌లో మీడియాతో గురువారం మాట్లాడారు. కాంగ్రెస్ పాల‌న‌లో అరాచ‌కాలు పెరిగిపోయాయ‌ని, ప్ర‌శ్నించే వారిని వేధిస్తున్నార‌న్నారు. కాంగ్రెస్ దౌర్జ‌న్యాల‌పై తాము పింక్ బుక్ మెయింటైన్ చేస్తున్నామని, చేసిన తప్పులన్నీ లెక్కగడుతున్నామ‌ని, ఎవరినీ వదిలే ప్రసక్తే లేదు. ఇంతకింత చెల్లిస్తామ‌ని హ‌చ్చ‌రించారు.

ఎమ్మెల్సీ క‌విత వ్యాఖ్య‌లు తెలంగాణ రాష్ట్ర రాజ‌కీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. అధికార పార్టీ తీసుకుంటున్న నిర్ణయాలు, వ్యవహారశైలి మీద బీఆర్ఎస్ తీవ్ర అసంతృప్తితో ఉంది. ఇటీవ‌ల కేటీఆర్ కూడా కాంగ్రెస్ పార్టీల‌పై తీవ్రంగా మండిప‌డిన విష‌యం తెలిసిందే. ద‌మ్ముంటే కొడంగ‌ల్‌లో రాజీనామా చేసి 50 వేల కంటే ఎక్కువ మెజార్టీతో గెలిస్తే రాజకీయ స‌న్యాసం తీసుకుంటాన‌ని సంచ‌ల‌న స‌వాల్ విసిరారు.

Join WhatsApp

Join Now

Leave a Comment