ఫోన్ ట్యాపింగ్ కేసు (PhoneTapping Case)లో సిట్(SIT) దూకుడు ప్రదర్శిస్తోంది. అమెరికా (America) నుంచి వచ్చినప్పటి నుంచి మాజీ ఎస్ఐబీ చీఫ్ (Former SIB Chief) ప్రభాకర్ రావు (Prabhakar Rao) విచారణకు పలుమార్లు హాజరయ్యారు. ఇదే కేసులో ఇవాళ ఉదయం 11 గంటలకు ఆయన మరోసారి సిట్ కార్యాలయంలో అధికారుల ఎదుట విచారణకు హాజరయ్యారు. ఈ విచారణలో మరో కీలక నిందితుడు అయిన ఎస్ఐబీ మాజీ డీఎస్పీ (Former SIB DSP) ప్రణీత్ రావు (Praneeth Rao)ను కూడా ప్రభాకర్తో కలిసి ప్రశ్నించనున్నట్లు సమాచారం. ఇందులో కీలక అంశాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ప్రభాకర్రావు విచారణకు హాజరవ్వడం ఇది నాలుగోసారి కావడం గమనార్హం.
ప్రణీత్ రావు భూమికపై దృష్టి
బుధవారం ప్రణీత్ రావును సిట్ అధికారులు విచారించిన విషయం తెలిసిందే. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలకంగా వ్యవహరించిన ఆయనపై పలు ప్రశ్నలు సంధించారు. 2023 ఎన్నికల ముందు ఎస్ఐబీ కార్యకలాపాలను ఆయన ఆధ్వర్యంలో నడిపారు. రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు సహా పలువురి ఫోన్లు ట్యాప్ చేయడంలో ఆయన పాత్ర ఉందని అనుమానం.
ఇప్పటికే ప్రభాకర్ రావు ఇచ్చిన వాంగ్మూలాన్ని (Statement) ఆధారంగా తీసుకుని, దానికి అనుగుణంగా ప్రణీత్ రావుకు అధికారులు ప్రశ్నలు వేస్తున్నారు. ఇదిలా ఉండగా, టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud), టీపీసీసీ ప్రతినిధి జైపాల్ రెడ్డి (Jaipal Reddy)లు సిట్ ఎదుట హాజరై తమ వాంగ్మూలాలు ఇచ్చారు.