అంతర్జాతీయ మార్కెట్లో (International Market) చమురు ధరలు (Crude Oil Prices) మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో దేశంలో ప్రీమియం పెట్రోల్ (Premium Petrol) ధరలు (Prices) పెరగడం వాహనదారులకు షాక్ ఇచ్చింది. హెచ్పి (HP) ‘పవర్’, ఇండియన్ ఆయిల్ (IOC) ‘XP95’ వంటి ప్రీమియం పెట్రోల్ రకాల ధరలు లీటరుకు రూ. 2 నుంచి రూ. 2.30 వరకు పెరిగాయి. మిడిల్ ఈస్ట్లో యుద్ధ వాతావరణం (War Situation), ఇరాన్ దాడుల (Iran Attacks) కారణంగా గల్ఫ్ ప్రాంతంలో ఉత్పత్తి తగ్గడంతో ఈ ప్రభావం పడింది. మార్చి 20, 2026 నుంచి కొత్త ధరలు అమల్లోకి వచ్చాయి. అయితే సాధారణ పెట్రోల్ ధరల్లో మాత్రం ఎలాంటి మార్పు లేకపోవడం కొంత ఉపశమనంగా భావిస్తున్నారు.
ఇక ప్రపంచ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ధర (Brent Crude Oil Price) సుమారు 108 డాలర్లు, WTI ధర 95 డాలర్ల వద్ద కొనసాగుతుండగా పరిస్థితి ఇంకా ఆందోళనకరంగానే ఉంది. యూరప్ దేశాలు, జపాన్ సముద్ర మార్గ భద్రతకు సహాయం చేస్తామని ప్రకటించడం, అమెరికా సరఫరా పెంచే చర్యలు తీసుకోవడం వల్ల స్వల్ప ఉపశమనం కనిపించినా.. ధరలు ఇంకా అధిక స్థాయిలోనే ఉన్నాయి. నిపుణుల ప్రకారం చమురు ధరలు బ్యారెల్కు 110 డాలర్లను దాటితే భారత ఆర్థిక వ్యవస్థపై (Indian Economy) తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. అలా జరిగితే సాధారణ పెట్రోల్ ధరలు కూడా పెరగడం తప్పదని హెచ్చరిస్తున్నారు.







