పుణ్య‌క్షేత్రాల యాత్ర‌లో ప‌వ‌న్ వెంట అకీరా

పుణ్య‌క్షేత్రాల యాత్ర‌లో ప‌వ‌న్ వెంట అకీరా

ఏపీ డిప్యూటీ సీఎం, జ‌న‌సేన పార్టీ అధినేత ప‌వ‌న్ కళ్యాణ్ ద‌క్షిణాది రాష్ట్రాల్లోని పుణ్య‌క్షేత్రాల‌ను ద‌ర్శించుకుంటున్నారు. నిన్న ఉద‌యం హైద‌రాబాద్ నుంచి బ‌య‌ల్దేరి కేర‌ళ రాష్ట్రం కొచ్చిలో అడుగుపెట్టిన ప‌వ‌న్‌.. శ్రీ అగ‌స్త్య మ‌హ‌ర్షి ఆల‌యాన్ని సంద‌ర్శించారు. ప్ర‌త్యేక పూజ‌ల్లో పాల్గొని తీర్థ ప్ర‌సాదాలు స్వీక‌రించారు. సాయంత్రం తిరువనంతపురం సమీపంలోని ప్రఖ్యాత తిరువల్లం శ్రీ పరుశురామ క్షేత్రాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

పుణ్య‌క్షేత్రాల ప‌ర్య‌ట‌న‌లో భాగంగా రెండ‌వ రోజు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ తమిళనాడు రాష్ట్రంలోని తంజావూరు చేరుకున్నారు. కుంభకోణం సమీపంలోని స్వామిమలై క్షేత్రాన్ని దర్శించుకున్నారు. షష్ట షణ్ముఖ క్షేత్రాల్లో ఐదవ క్షేత్రం స్వామిమలై. ఆలయంలో ప‌వ‌న్‌ ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఆధ్యాత్మిక ప‌ర్య‌ట‌న‌లో ఆయ‌న కుమారుడు అకీరానంద‌న్ క‌నిపించాడు. తండ్రితో పాటు పంచ‌క‌ట్టి ఆల‌యాల‌ను సంద‌ర్శించుకుంటున్నారు. ప్ర‌స్తుతం ప‌వ‌న్ వెంట అకీరా నంద‌న్ ఉన్న ఫొటోలను జ‌న‌సేన ఫ్యాన్స్ స‌ర్క్య‌లేట్ చేస్తున్నారు. తండ్రీకొడుకుల‌ను ఒకే ఫ్రేమ్‌లో చూసి మురిసిపోతున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment