బుద్ధి చూపించిన పాక్‌.. ఒప్పందం ఉల్లంఘ‌న‌

బుద్ధి చూపించిన పాక్‌.. ఒప్పందం ఉల్లంఘ‌న‌

భారత్-పాకిస్తాన్‌ల మధ్య శనివారం కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. అమెరికా మధ్యవర్తిత్వంతో జరిగిన చర్చల అనంతరం ఈ ఒప్పందం అమలులోకి వచ్చింది. అయితే, అమలులోకి వచ్చిన కొన్ని గంటలకే పాకిస్థాన్ తన అసలైన స్వభావాన్ని బయటపెట్టింది. ఎల్ఓసీ (నియంత్రణ రేఖ)తో పాటు అంతర్జాతీయ సరిహద్దుల వెంబడి పాక్ సైన్యం రెచ్చిపోయి కాల్పులు, డ్రోన్ దాడులను కొనసాగించింది. భారత్–పాకిస్తాన్ మధ్య పరస్పర అంగీకారం కుదిరిన కొన్ని గంటల వ్యవధిలోనే పాకిస్తాన్ ఉల్లంఘనకు పాల్పడింది. జమ్మూకశ్మీర్‌లోని అనంతనాగ్, బుడ్గాం, శ్రీనగర్ ప్రాంతాల్లో దాడుల‌కు తెగ‌బ‌డింది.

భారత్-పాకిస్థాన్ డీజీఎంఓలు శనివారం మధ్యాహ్నం చర్చలు జరిపారు. భూమి, గగనతలం, సముద్ర మార్గాల్లో అన్ని రకాల కాల్పులు, సైనిక చర్యలను నిలిపివేయాలని ఇరు దేశాలు అంగీకరించాయి. భారత కాలమానం ప్రకారం శనివారం సాయంత్రం 5 గంటల నుంచి ఈ ఒప్పందం అమల్లోకి వచ్చినట్లు భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ వెల్లడించారు. మే 12న మరోసారి డీజీఎంఓల మధ్య చర్చలు జరగనున్నట్లు ఆయన పేర్కొన్నారు.

కానీ, ఒప్పందానికి విరుద్ధంగా శనివారం రాత్రి పాకిస్థాన్ డ్రోన్లు భారత సరిహద్దులు దాటి లోనికి ప్రవేశించాయి. జమ్మూ కశ్మీర్ నుండి గుజరాత్‌ భుజ్ వరకు పలు ప్రాంతాల్లో పాక్ డ్రోన్లు గుర్తించారు. దీంతో సరిహద్దు నగరాల్లో బ్లాక్‌అవుట్ విధించడంతో జన జీవనం క్షణాల్లో స్తంభించిపోయింది. భార‌త్‌-పాక్ ఒప్పందాన్ని అంతర్జాతీయ సమాజం స్వాగతించినప్పటికీ, పాకిస్థాన్ మాత్రం తన పాత పద్ధతిని వీడలేదు.

Join WhatsApp

Join Now

Leave a Comment