జూనియర్ ఎన్టీఆర్ (Junior NTR) అభిమానులకు ఇదొక ముచ్చటైన వార్త. ప్రశాంత్ నీల్ (Prashanth Neel) దర్శకత్వంలో ఎన్టీఆర్ నటిస్తున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ (Action Entertainer) చిత్రం గురించి ఆసక్తికరమైన అప్డేట్ (Update) వెలుగులోకి వచ్చింది. తాజాగా ఈ చిత్రం తొలి షెడ్యూల్ పూర్తి చేసినట్లు మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఈ షెడ్యూల్ లో భారీ యాక్షన్ సీక్వెన్స్ లను తెరకెక్కించినట్టు సమాచారం.
ప్రశాంత్ నీల్ మార్క్ యాక్షన్ అంటేనే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉంటాయి కాబట్టి, ఈ చిత్రంపై ఆసక్తి మరింత పెరిగింది. ఇక, ఎన్టీఆర్ సరసన కథానాయికగా రుక్మిణి వసంత్ (Rukmini Vasanth) నటించనున్నట్టు టాక్. అయితే దీనిపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.
ఈ చిత్రం గురించి మరిన్ని ఆసక్తికరమైన వివరాలు త్వరలోనే వెల్లడయ్యే అవకాశం ఉంది. ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమా పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతోంది. ఎన్టీఆర్ నీల్ కాంబినేషన్ వస్తున్న ఈ సినిమాపై యంగ్ టైగర్ ఫ్యాన్స్ (Fans) భారీ అంచనాలు పెట్టుకున్నారు.