ఎన్టీఆర్ అభిమానులకు క్రేజీ అప్డేట్

ఎన్టీఆర్ అభిమానులకు క్రేజీ అప్డేట్

జూనియర్ ఎన్టీఆర్ (Junior NTR) అభిమానులకు ఇదొక ముచ్చటైన వార్త. ప్రశాంత్ నీల్ (Prashanth Neel) దర్శకత్వంలో ఎన్టీఆర్ నటిస్తున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ (Action Entertainer) చిత్రం గురించి ఆసక్తికరమైన అప్‌డేట్ (Update) వెలుగులోకి వచ్చింది. తాజాగా ఈ చిత్రం తొలి షెడ్యూల్ పూర్తి చేసినట్లు మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఈ షెడ్యూల్ లో భారీ యాక్షన్ సీక్వెన్స్‌ లను తెరకెక్కించినట్టు సమాచారం.

ప్రశాంత్ నీల్ మార్క్ యాక్షన్ అంటేనే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉంటాయి కాబట్టి, ఈ చిత్రంపై ఆసక్తి మరింత పెరిగింది. ఇక, ఎన్టీఆర్ సరసన కథానాయికగా రుక్మిణి వసంత్ (Rukmini Vasanth) నటించనున్నట్టు టాక్. అయితే దీనిపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

ఈ చిత్రం గురించి మరిన్ని ఆసక్తికరమైన వివరాలు త్వరలోనే వెల్లడయ్యే అవకాశం ఉంది. ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమా పాన్ ఇండియా మూవీగా తెర‌కెక్కుతోంది. ఎన్టీఆర్ నీల్ కాంబినేష‌న్ వ‌స్తున్న ఈ సినిమాపై యంగ్ టైగ‌ర్ ఫ్యాన్స్ (Fans) భారీ అంచ‌నాలు పెట్టుకున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment