అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పనిచేస్తున్న రోజా అనే యువతి విశాఖపట్నంలో అనుమానాస్పద రీతిలో మరణించిన ఘటన సంచలనం రేపుతోంది. శనివారం జరిగిన ఈ సంఘటనకు సంబంధించి పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పనిచేస్తున్న రోజా తన స్నేహితుడు శ్రీధర్ను కలిసేందుకు విశాఖపట్టణానికి వచ్చింది. హోటల్లో బస చేసిన ఆమె, స్నానానికి వెళ్లిన తర్వాత తిరిగి రాలేదు. దీనిపై ఆమె స్నేహితుడు శ్రీధర్ పోలీసులకు సమాచారం అందించాడు.
దర్యాప్తులో అనుమానాస్పద అంశాలు
పోలీసులు ప్రాథమికంగా ఆత్మహత్యగా కేసు నమోదు చేసినప్పటికీ, కొన్ని అనుమానాస్పద అంశాలను గుర్తించారు. దీంతో శ్రీధర్ను అదుపులోకి తీసుకుని విచారణ కొనసాగిస్తున్నారు. ఈ ఘటనపై సీపీ శంఖబ్రత బాగ్చి స్పందిస్తూ.. విశాఖలోని మేఘాలయ హోటల్ విగత జివిగా పడి ఉన్నట్లుగా సమాచారం వచ్చిందని, ఎన్ఆర్ఐ మహిళ మృతిపై పట్టణ 3వ పోలీస్ స్టేషన్లో పరిధిలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. పోస్ట్ మార్టం రిపోర్ట్ వస్తే దాని ఆధారంగా విచారణ కొనసాగిస్తామని చెప్పారు.