అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకన్దక్షిణ కొరియా, జపాన్ పర్యటనలో ఉన్న సమయంలో, ఉత్తర కొరియా తన హైపర్ సోనిక్ క్షిపణి పరీక్షను విజయవంతంగా నిర్వహించింది. పసిఫిక్ సముద్రంలోని ఏ శత్రువునైనా ఈ క్షిపణి ఎదుర్కోగలదని, ఇది తమ భద్రతను పెంచుతుందని నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ పేర్కొన్నారు. ఈ ప్రయోగాన్ని స్వయంగా దగ్గరుండి పరిశీలించినట్లు కిమ్ వెల్లడించారని కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ (KCNA) తెలిపింది.
వేగం, ప్రయాణం, వివాదం
ఈ క్షిపణి శబ్దం కంటే 12 రెట్ల వేగంతో 1,500 కిలోమీటర్లు ప్రయాణించి సముద్రంలో పడిందని ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ తెలిపారు. అయితే, దక్షిణ కొరియా మాత్రం ఇది కేవలం 1,100 కిలోమీటర్ల మాత్రమే ప్రయాణించిందని పేర్కొంది. నవంబర్ 2023 తర్వాత ఇది నార్త్ కొరియా మొదటి మిస్సైల్ పరీక్షగా నిలిచింది.
ఈ క్షిపణి ఆత్మరక్షణ ప్రణాళికలో భాగమని, దాడి చేయడానికి ఉద్దేశించినది కాదని
కిమ్ జోంగ్ ఉన్ తెలిపారు. ఈ క్షిపణి ప్రపంచం విస్మరించవలసిన అంశం కాదని, అత్యుత్తమ రక్షణ వ్యవస్థలను కూడా ఛేదించే సామర్థ్యం కలిగివుందని వెల్లడించారు. భవిష్యత్తులో తమ రక్షణ సామర్థ్యాలను మరింతగా పెంపొందించనున్నట్లు కిమ్ స్పష్టంచేశారు.