దేశంలో టోల్ వసూలు (Toll Collection) విధానాన్ని పూర్తిగా మార్చబోతున్నట్లు కేంద్ర రవాణా మంత్రి నితిన్ గడ్కరీ (Nitin Gadkari) లోక్సభ (Lok Sabha)లో ప్రకటించారు. ఇప్పటికే పదివైపులా ప్రయోగాత్మకంగా అమలు చేసిన శాటిలైట్ ఆధారిత కొత్త టోల్ వ్యవస్థ విజయవంతం కావడంతో, ప్రస్తుత టోల్ గేట్లను ఏడాదిలోనే పూర్తిగా తొలగించే దిశగా ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది. వాహనాలు ఇకపై టోల్ ప్లాజాల వద్ద ఆగాల్సిన అవసరం లేకుండా, ప్రయాణించిన దూరానికి అనుగుణంగా టోల్ రుసుము స్వయంచాలకంగా డిడక్ట్ అయ్యే విధంగా వ్యవస్థ రూపకల్పన జరిగింది.
ఈ ఆధునిక టోల్ సిస్టమ్ను నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) అభివృద్ధి చేసింది. దీని ద్వారా దేశవ్యాప్తంగా ఎలక్ట్రానిక్ టోల్ చెల్లింపులకు (Electronic Toll Payments) ఒకే వేదిక లభించబోతోంది. హైవేల్లో ట్రాఫిక్ తగ్గడం, ఇంధన వృథా అరికట్టడం, సమయం ఆదా కావడం వంటి అనేక ప్రయోజనాలు అందుబాటులోకి రావడం ఖాయమని గడ్కరీ స్పష్టం చేశారు. ప్రస్తుతం రూ.10 లక్షల కోట్లు విలువైన 4,500 హైవే ప్రాజెక్టులు ప్రగతిలో ఉన్నాయని ఆయన వివరించారు.
కొత్త టోల్ విధానం అమల్లోకి వచ్చిన వెంటనే దేశవ్యాప్తంగా ఉన్న అన్ని టోల్ బూత్లు తొలగించబడతాయి. శాటిలైట్ జీపీఎస్ ఆధారిత ఈ సాంకేతిక విధానం అమలు అయితే, రోడ్లపై టోల్ క్యూల సమస్య పూర్తిగా పరిష్కారమై, ప్రయాణం మరింత వేగవంతం అవుతుంది. డ్రైవర్లు, ట్రాన్స్పోర్ట్ రంగం, సాధారణ ప్రయాణికులు అందరికీ పెద్ద ఉపశమనం లభించే అవకాశం ఉందని కేంద్ర మంత్రి తెలిపారు.








