NDA ఉపరాష్ట్రపతి అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్

NDA ఉపరాష్ట్రపతి అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్

దేశంలో ఉపరాష్ట్రపతి (Vice President) ఎన్నిక అభ్య‌ర్థిపై కొన‌సాగుతున్న ఉత్కంఠ‌త‌కు తెర‌ప‌డింది. తాజాగా ఎన్డీఏ కూటమి (NDA Alliance) తన అభ్యర్థి పేరును ఖరారు చేసింది. బీజేపీ(BJP) అధికారిక స‌మాచారం మేర‌కు ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో సీపీ రాధాకృష్ణన్ (CP Radhakrishnan) ఎన్డీఏ అభ్యర్థిగా పోటీ చేయనున్నారు. ప్రస్తుతం మహారాష్ట్ర గవర్నర్‌గా కొనసాగుతున్న సీపీ రాధాకృష్ణన్, ఇంతకుముందు జార్ఖండ్ మరియు తెలంగాణ రాష్ట్రాల గవర్నర్‌గానూ సేవలందించారు. రాజకీయ జీవితాన్ని తమిళనాడులో ప్రారంభించిన ఆయన, రెండు సార్లు కోయంబత్తూరు లోకసభ నియోజకవర్గం నుండి ఎంపీగా ఎన్నికయ్యారు. అదనంగా, బీజేపీ తమిళనాడు రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా ముఖ్యపాత్ర పోషించారు.

రాజకీయ ప్రాధాన్యం
సీపీ రాధాకృష్ణన్‌ను ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక చేయడం ద్వారా, దక్షిణాదిపై బీజేపీ దృష్టి ఉందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఇప్పటికే రాష్ట్రపతి పదవిలో ద్రౌపది ముర్ము కొనసాగుతుండగా, ఇప్పుడు ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా రాధాకృష్ణన్ పేరును ఖరారు చేయడం NDAలో వ్యూహాత్మక అడుగుగా భావిస్తున్నారు. ఈ పరిణామంతో ఉపరాష్ట్రపతి ఎన్నికలపై రాజకీయ వాతావరణం మరింత రసవత్తరంగా మారింది.

Join WhatsApp

Join Now

Leave a Comment