మావోయిస్టుల దాడి.. మందుపాత‌ర పేలి 10 మంది జవాన్ల మృతి

మావోయిస్టుల దాడి.. మందుపాత‌ర పేలి 10 జవాన్ల మృతి

ఛత్తీస్‌గ‌ఢ్‌లోని సుకుమా జిల్లాలో మావోయిస్టులు మందుపాత‌ర పేల్చారు. భద్రతా బలగాల వాహనాన్ని లక్ష్యం చేసుకొని మావోయిస్టులు జ‌రిపిన బాంబు దాడిలో 10 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. పేలుడు సమయంలో వాహనంలో 15 మంది జ‌వాన్లు ఉన్న‌ట్లు స‌మాచారం. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశముందని, భద్రతా అధికారులు ఘటనాస్థలానికి చేరుకొని పరిస్థితిని పరిశీలిస్తున్నారు.

కుత్రు అటవీ ప్రాంతంలో భద్రతాబలగాలు ప్రయాణిస్తున్న వాహనాన్ని మందుపాతర పెట్టి పేల్చివేశారు మావోయిస్టులు. ఈ ఘటనలో 10 మంది జ‌వాన్లు ప్రాణాలు కోల్పోయారు. క్షతగాత్రులను బీజాపూర్‌ జిల్లా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పెట్రోలింగ్‌లో భాగంగా ఇవాళ ఉదయం జవాన్లు కుత్రు అటవీ ప్రాంతంలో ప్రయాణిస్తుండగా.. వారిని లక్ష్యంగా చేసుకొని మావోయిస్టులు ఐఈడీ పేల్చిన‌ట్లు స‌మాచారం.

రెండ్రోజుల క్రితం ఛత్తీస్‌గఢ్ స‌రిహ‌ద్దు ప్రాంతంలో మావోయిస్టుల క‌ద‌లిక‌ల నేప‌థ్యంలో భద్రతా దళాలు కూంబింగ్ ఆప‌రేష‌న్ చేప‌ట్టారు. భ‌ద్ర‌తా ద‌ళాలు, మావోయిస్టులకు మధ్య జరిగిన కాల్పుల్లో నలుగురు మావోయిస్టులు, ఒక కానిస్టేబుల్ మృతిచెందిన విష‌యం తెలిసిందే.

Join WhatsApp

Join Now

Leave a Comment