నేషనల్ హెరాల్డ్ కేసు.. ఛార్జిషీట్‌లో సోనియా, రాహుల్ పేర్లు

నేషనల్ హెరాల్డ్ కేసు.. ఛార్జిషీట్‌లో సోనియా, రాహుల్ పేర్లు

కాంగ్రెస్ పార్టీ (Congress Party) లో కలకలం రేపుతున్న నేషనల్ హెరాల్డ్ కేసు (National Herald Case) కీల‌క మ‌లుపు తిరిగింది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్ (Enforcement Directorate) సంచ‌ల‌న నిర్ణయం తీసుకుంది. మనీ ల్యాండరింగ్ (Money Laundering) కేసులో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ (Sonia Gandhi), రాహుల్ గాంధీ (Rahul Gandhi) పేర్లను ఛార్జిషీట్‌లో చేర్చింది. ఛార్జ్‌షీట్‌ (Chargesheet)లో కాంగ్రెస్ పార్టీ అగ్ర‌నేత‌ల పేర్లు చేర్చ‌డం హాట్ టాపిక్‌గా మారింది. ఇది పార్టీకి పెద్ద దెబ్బగా కాంగ్రెస్ నేత‌లు భావిస్తున్నారు.

ఈ కేసులో ఇప్పటికే నేషనల్ హెరాల్డ్‌కు సంబంధించిన ఆస్తుల జప్తునకు ఈడీ నోటీసులు జారీ చేసింది. తాజాగా దాఖలైన ఛార్జిషీట్‌పై ఈ నెల 25న ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు (Rouse Avenue Court)లో వాదనలు జరగనున్నాయి. ఇప్పటికే ఈ కేసు రాజకీయంగా దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారి తీస్తున్న సమయంలో, ఈడీ తాజా చర్యలతో కాంగ్రెస్ పార్టీపై ఒత్తిడి మరింత పెరిగిన‌ట్లుగా రాజ‌కీయ విశ్లేష‌కులు భావిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment