టీ20 ప్రపంచ కప్ 2026 క్లైమాక్స్కు సమయం ఆసన్నమైంది. రేపు ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం అయిన అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ జట్లు జగజ్జేతలుగా నిలిచేందుకు పోటీ పడనున్నాయి. అయితే, ఈ స్టేడియంలో టీమిండియా గత రికార్డులు, విన్నింగ్ రేషియో ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి.
మోడీ స్టేడియంలో భారత్ రికార్డు
ఈ స్టేడియం పునరుద్ధరణ తర్వాత భారత్ ఇక్కడ అద్భుతమైన ఫామ్లో ఉంది. మొత్తం మ్యాచ్లు 10 ఆడితే వాటిలో భారత్ గెలిచినవి 7, ఓడినవి 3 అని గణాంకాలు చెబుతున్నాయి. అలా చూసినా టీమిండియాకు విన్నింగ్ రేట్ 70 శాతం ఉంది. అదే ఈ మైదానంలో వన్డే ప్రపంచ కప్ (2023) ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో భారత్ ఓటమి పాలవ్వడం అభిమానులను కాస్త కలవరపెడుతోంది. అయితే, టీ20 ఫార్మాట్లో మాత్రం భారత్ ఇక్కడ చాలా బలంగా ఉంది.
పిచ్ రిపోర్ట్.. ఫస్ట్ బ్యాటింగా? ఛేజింగా?
అహ్మదాబాద్ పిచ్ సాధారణంగా బ్యాటింగ్కు అనుకూలంగా ఉంటుంది. మ్యాచ్ ప్రారంభంలో బ్యాటర్లకు, పేసర్లకు అనుకూలంగా ఉంటుంది. మ్యాచ్ సాగుతున్న కొద్దీ పిచ్ నెమ్మదించి స్పిన్నర్లకు పట్టు దొరుకుతుంది. ఈ స్టేడియంలో ఇప్పటివరకు జరిగిన టీ20ల్లో మొదట బ్యాటింగ్ చేసిన జట్లు 7 సార్లు గెలవగా, ఛేజింగ్ చేసిన జట్లు కేవలం 3 సార్లు మాత్రమే గెలిచాయి. రాత్రి వేళ మంచు కురిసే అవకాశం ఉంటే మాత్రం ఛేజింగ్ సులభం అవుతుంది. లేదంటే మొదట భారీ స్కోరు బోర్డుపై ఉంచడమే ఉత్తమం.
భారత్ vs న్యూజిలాండ్.. హెడ్-టు-హెడ్
మొత్తం తలపడినవి 30 మ్యాచ్లు. ఇందులో టీమిండియా గెలిచిన మ్యాచ్లు 18 కాగా, న్యూజిలాండ్ గెలిచినవి 11 మాత్రమే. 30లో ఒక మ్యాచ్ ఫలితం తేలలేదు. ఈ మైదానంలో కివీస్తో జరిగిన ఏకైక టీ20లో భారత్ 168 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. (శుభ్మన్ గిల్ 126* పరుగులు చేసిన మ్యాచ్ ఇది).
న్యూజిలాండ్ ‘ఫైనల్’ గండం
న్యూజిలాండ్ జట్టు ఐసీసీ టోర్నీలలో నిలకడగా రాణిస్తున్నా, ఫైనల్స్ నెగ్గడంలో తడబడుతోంది. కివీస్ ఇప్పటివరకు 8 ప్రధాన ఐసీసీ ఫైనల్స్ ఆడగా, అందులో 5 సార్లు ఓడిపోయింది. 2015, 2019 వన్డే వరల్డ్ కప్స్, 2021 టీ20 వరల్డ్ కప్ ఫైనల్స్లోనూ రన్నరప్గానే మిగిలిపోయింది. ఇటీవల జరిగిన 2025 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లోనూ భారత్ చేతిలోనే ఓటమి పాలైంది.
విన్నింగ్ ప్రెడిక్షన్
ప్రస్తుత ఫామ్ మరియు హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్ చూస్తుంటే భారత్కు గెలిచే అవకాశాలు 60-65% వరకు ఉన్నాయి. అయితే, ఐసీసీ టోర్నీలలో న్యూజిలాండ్ను తక్కువ అంచనా వేయలేం.








