పట్టపగలు దారుణ హత్య.. హోటల్ వద్ద కత్తులతో దాడి

పట్టపగలు దారుణ హత్య.. హోటల్ వద్ద కత్తులతో దాడి

నిత్యం ప్రజలతో కిటకిటలాడే నాంపల్లి ప్రాంతంలోని ఓ హోట‌ల్ వ‌ద్ద‌ పట్టపగలు ఓ వ్యక్తిపై ఐదుగురు దుండగులు కత్తులతో విచక్షణారహితంగా దాడి చేసి హతమార్చారు. ఈ ఘటన స్థానికుల్లో భయాందోళనలను రేకెత్తించింది. ఈ దారుణ సంఘటన నాంపల్లిలోని ఒక ప్రైవేట్ ఆస్ప‌త్రికి ఎదురుగా ఉన్న హోటల్ వద్ద గురువారం జ‌రిగింది. మృతుడు హోటల్ వద్ద టీ తాగేందుకు వచ్చిన సమయంలో, ఐదుగురు దుండగులు అతడిపై అకస్మాత్తుగా కత్తులతో దాడి చేశారు. దాడి అనంతరం నిందితులు ఘటనా స్థలం నుంచి పరారయ్యారు. తీవ్ర గాయాలతో రక్తపు మడుగులో పడిపోయిన బాధితుడు అక్కడికక్కడే మృతిచెందాడు.

పోలీసుల దర్యాప్తు
నాంపల్లి పోలీసులు వెంటనే క్లూస్ టీమ్‌ను రంగంలోకి దించి ఆధారాల సేకరణ ప్రారంభించారు. సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తూ, దుండగుల ఆచూకీ కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. ఈ హత్య వెనుక గల కారణాలు, నిందితులు ఎవరనే విషయంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. పోలీసులు ఈ ఘటనకు సంబంధించి హత్య కేసు నమోదు చేసి, దర్యాప్తును వేగవంతం చేశారు.

Join WhatsApp

Join Now

Leave a Comment