ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా పర్యటన ముగిసింది. ఈ పర్యటనలో భారత్-అమెరికా సంబంధాల బలోపేతం, వాణిజ్య ఒప్పందాలు, భద్రతా అంశాలపై చర్చలు జరిగాయి. అయితే, ఈ పర్యటనలో ఒక విశేషమైన ఘటన జరిగింది. ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ ప్రధాని మోడీకి అందించిన ప్రత్యేక గిఫ్ట్ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
ఎలాన్ మస్క్ ఏం గిఫ్ట్ ఇచ్చారు?
వాషింగ్టన్లోని బ్లేయిర్ హౌజ్లో ప్రధాని మోడీతో మస్క్తో పాటు ఆయన పిల్లలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మస్క్ ప్రధాని మోడీకి ‘‘స్టార్ షిప్’’ హీట్ షీల్డ్ టైల్ను బహుమతిగా అందజేశారు. ఇది స్పేస్ ఎక్స్ అభివృద్ధి చేసిన హీట్ షీల్డ్ టైల్స్లో ఒకటి.
ఈ హీట్ షీల్డ్ టైల్స్ ప్రత్యేకంగా హెగ్జాగోనల్ ఆకారంలో ఉండే సిరామిక్ టైల్స్. అంతరిక్ష నౌకలు భూమికి తిరిగి వచ్చే సమయంలో ఏర్పడే విపరీతమైన ఉష్ణోగ్రతను తట్టుకునేందుకు వీటి వినియోగం ఉంటుంది. ఇది వందల డిగ్రీల వేడిని తట్టుకుని అంతరిక్ష నౌకలను రక్షించే సామర్థ్యం కలిగి ఉంటుంది.