టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ క్రిస్మస్ వేడుకను తన కుటుంబంతో కలిసి సందడిగా జరుపుకున్నారు. పండుగ పూటను మరింత ఆహ్లాదకరంగా మారాలనుకుంటూ, ధోనీ స్వయంగా శాంటా క్లాజ్ గెటప్ ధరించి కుటుంబసభ్యులు, బంధువులకు గిఫ్టులు అందించారు. ఈ దృశ్యాలు ఎంతో స్పెషల్గా మారాయి.
ధోనీ సతీమణి సాక్షి సింగ్ ఇందుకు సంబంధించిన ఫొటోలను తన ఇన్స్టాగ్రామ్లో పంచుకోగా, అవి ధోనీ అభిమానులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఎంఎస్డీ ఫ్యాన్స్ వాటిని విపరీతంగా షేర్ చేస్తూ, క్రిస్మస్ సందర్భంగా ధోనీ సింప్లిసిటీని, ప్రేమను ప్రశంసిస్తున్నారు.








