యుద్ధం వేళ ఇరాన్‌లో అధికారం మార్పు

అయతొల్లా అలీ ఖమేనీ (Ayatollah Ali Khamenei) మరణం తర్వాత పశ్చిమాసియాలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఇరాన్ (Iran) దేశంలో అత్యున్నత పదవిగా భావించే సుప్రీం లీడర్ (Supreme Leader) బాధ్యతలను ఖమేనీ రెండో కుమారుడు మొజ్తబా దయోసి ఖమేనీ (Mojtaba Dayoosi Khamenei)కి అప్పగించినట్లు అధికారికంగా ప్రకటించారు. ఇరాన్ అసెంబ్లీ సభ్యులు తీసుకున్న ఈ నిర్ణయం అంతర్జాతీయ స్థాయిలో చర్చకు దారితీస్తోంది.

సుప్రీం కమాండర్‌గా బాధ్యతలు

ఇరాన్ అధికార ప్రకటన ప్రకారం, దేశ సారథ్య బాధ్యతలు ఇప్పుడు మొజ్తబా చేతుల్లోకి వెళ్లాయి. ఖోమ్ నగరంలో విద్యాభ్యాసం చేసిన ఆయన ప్రస్తుతం అక్కడే మతాచార్యుడిగా సేవలందిస్తున్నారు. 1987-88 మధ్య జరిగిన ఇరాన్–ఇరాక్ యుద్ధ సమయంలో మొజ్తబా కీలక పాత్ర పోషించినట్లు చరిత్ర చెబుతోంది. అంతేకాక, 2009 ఎన్నికల సమయంలో జరిగిన నిరసనలను అణచివేయడంలో బాసిజ్ దళాలపై ఆయన ప్రభావం ఉన్నట్లు పూర్వ రికార్డులు సూచిస్తున్నాయి.

ఖమేనీ కుటుంబం నుంచి మరోసారి దేశాధికార బాధ్యతలు చేపట్టడం ఇరాన్ రాజకీయాల్లో కీలక మలుపుగా విశ్లేషకులు భావిస్తున్నారు. రాబోయే రోజుల్లో ఈ మార్పు దేశ విదేశాంగ, రక్షణ విధానాలపై ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి.

Join WhatsApp

Join Now

Leave a Comment