ఐసీపీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025 (Champions Trophy 2025) రెండో మ్యాచ్ దుబాయ్ వేదికగా ప్రారంభమైంది. ఈ టోర్నీలోని సెకండ్ మ్యాచ్ ఇండియా-బంగ్లాదేశ్ (IND vs BAN) మధ్య జరుగుతోంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లా.. క్రీజ్లోకి దిగింది. ముగ్గురు స్పిన్నర్లతో ఛాంపియన్స్ ట్రోఫీ తొలి సమరానికి టీమిండియా (Team India) బరిలోకి దిగింది. తొలి పది ఓవర్లలోనే బంగ్లాదేశ్ ఆటగాళ్లను భారత బౌలర్లు మట్టికరిపించారు. 35 పరుగులకే బంగ్లా 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. 23 ఓవర్లు పూర్తయ్యే సరికి ప్రస్తుతం బంగ్లాదేశ్ స్కోర్ 86/5.
తొమ్మిదో ఓవర్లో స్పిన్నర్ అక్షర్ పటేల్ హ్యాట్రిక్ వికెట్ టేకింగ్ను కెప్టెన్ రోహిత్ శర్మ మిస్ చేశాడు. బ్యాట్స్మెన్ క్యాచ్ ఇవ్వగా, స్లిప్లో ఉన్న రోహిత్ మిస్ చేశాడు. దీంతో అక్షర్ తో సహా టీమిండియా ప్లేయర్స్, ఫ్యాన్స్ నిరాశపడ్డారు.
భారత్ తొలిమ్యాచ్లో పేస్ బౌలర్ హర్షదీప్ సింగ్, స్పిన్నర్ వరున్ చక్రవర్తిని తుది జట్టుకు ఎంపిక చేయలేదు. హర్షిత్ రాణా, షమీలు పేస్ బౌలింగ్ బాధ్యతలు అప్పగించింది. ఆల్రౌండర్ రవీంద్ర జడేజాకు స్థానం కల్పించారు. ఈ మ్యాచ్లోముగ్గురు స్పిన్నర్లతో ఇండియా బరిలోకి దిగింది. జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ బంగ్లాదేశ్ బ్యాటర్లను కట్టడి చేస్తున్నారు. ముగ్గురు పేస్ బౌలర్లు, ఇద్దరు స్పిన్నర్లతో బంగ్లాదేశ్ ఆడుతోంది.