త్వరలో ట్రంప్‌తో ప్రధాని మోడీ భేటీ?

అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో ప్రధాని మోడీ భేటీకి అవకాశం

ప్రధానమంత్రి (Prime Minister) నరేంద్ర మోడీ (Narendra Modi), అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ (Donald Trump)ల మధ్య త్వరలో భేటీ  (Meeting) జరిగే అవకాశం ఉన్నట్లు అమెరికా వర్గాలు సంకేతాలు ఇచ్చాయి. ఈ భేటీ రెండు దేశాల మధ్య సుంకాల వివాదం (Tariffs Dispute) కారణంగా దెబ్బతిన్న సంబంధాలను మరోసారి బలోపేతం చేస్తుందని భావిస్తున్నారు.

సుంకాల విషయంలో ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ, మోడీ-ట్రంప్‌ల మధ్య బలమైన సంబంధాలు కొనసాగుతున్నాయని అమెరికా విదేశాంగ శాఖ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.ఈ ఏడాది చివర్లో లేదా వచ్చే ఏడాది ప్రారంభంలో జరగనున్న క్వాడ్ లీడర్స్ సమ్మిట్‌లో ఇద్దరు నాయకులు కలిసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ సమ్మిట్‌లో అన్ని ఏర్పాట్లు సక్రమంగా జరిగితే, ఈ ఏడాదిలోనే వారి భేటీ ఉండవచ్చు.

సుంకాల వివాదం: ట్రంప్ ప్రభుత్వం భారత్‌పై అకస్మాత్తుగా సుంకాలు విధించింది. తొలుత 25% సుంకం విధించగా, రష్యాతో సంబంధాల కారణంగా మరో 25% సుంకం విధించారు. దీంతో భారత్‌పై మొత్తం 50% సుంకం భారం పడింది. దీనిపై ప్రధాని మోడీ “రైతుల కోసం ఎంత భారమైనా భరిస్తాం” అని ప్రకటించారు. ఈ పరిణామాలు రెండు దేశాల మధ్య సంబంధాలను దెబ్బతీశాయి. ఈ భేటీ జరిగితే ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment