దేశ రాజధాని ఢిల్లీలో గురువారం అర్ధరాత్రి భయానక ఘటన చోటుచేసుకుంది. నిజాముద్దీన్ ప్రాంతంలోని జంగ్పురా భోగల్ లేన్లో రాత్రి 11 గంటల సమయంలో జరిగిన చిన్నపాటి వాగ్వాదం రక్తపాతం వరకు వెళ్లింది.
నటి హ్యూమా ఖురేషీ బంధువు అసిఫ్ ఖురేషీ ఓ ఇంటి గేటు వద్ద టూ వీలర్ పార్క్ చేయగా, అక్కడి వ్యక్తులతో మాటమాట పెరిగింది. ఆ తగవు క్షణాల్లోనే ఉధృతమై, కొందరు పదునైన ఆయుధాలతో అసిఫ్పై దారుణంగా దాడి చేశారు.
తీవ్రంగా గాయపడిన అసిఫ్ను పోలీసులు ఆసుపత్రికి తరలించగా, వైద్యులు ఆయన అప్పటికే మృతి చెందినట్లు ధృవీకరించారు. ఈ ఘటనపై నిజాముద్దీన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.








