సీఈసీ ఎంపికపై రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు

సీఈసీ ఎంపికపై రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు

భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC)గా జ్ఞానేశ్ కుమార్ నియమితులైన నేపథ్యంలో ఈ నిర్ణయంపై లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు చేశారు. సుప్రీం కోర్టులో విచారణ కొనసాగుతున్న సమయంలోనే అర్ధరాత్రి వేళ ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షా నిర్ణయం తీసుకోవడం అనైతికమని ఆయన వ్యాఖ్యానించారు.

రాహుల్ గాంధీ ఏమన్నారంటే?
“ప్రధాన ఎన్నికల కమిషనర్ ఎంపిక ప్రక్రియలో మేము అభ్యంతరాలను వ్యక్తపరిచాం. ఎన్నికల సంఘం పూర్తిగా స్వతంత్రంగా ఉండాలి. కానీ సుప్రీం కోర్టు విచారణ కొనసాగుతున్న సమయంలోనే అర్ధరాత్రి కొత్త సీఈసీని ఎంపిక చేయడం ప్రజల్లో నమ్మకాన్ని దెబ్బతీస్తుంది అని” రాహుల్ గాంధీ తన ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో పేర్కొన్నారు.

భారత ఎన్నికల సంఘం సీఈసీగా జ్ఞానేశ్ కుమార్, ఎన్నికల కమిషనర్‌గా వివేక్ జోషి నియమితులయ్యారు. ఈ నియామకాల కోసం ప్రధాన మంత్రి మోడీ నేతృత్వంలోని త్రిసభ్య కమిటీ నిర్ణయం తీసుకుంది. ఈ కమిటీలో మోడీ, హోంమంత్రి అమిత్ షా, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఉన్నారు.

కొత్త చట్టం ప్రకారం సీఈసీ నియామకంపై ఇప్పటికే సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఫిబ్రవరి 19న ఈ పిటిషన్‌పై విచారణ జరగనుంది. రాహుల్ గాంధీ సుప్రీంకోర్టు తీర్పు వచ్చే వరకు ఈ నియామకాన్ని నిలిపివేయాలని కోరినట్లు సమాచారం. అయితే, కేంద్ర ప్రభుత్వం అర్ధరాత్రి వేళ ఈ నిర్ణయం తీసుకోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

Join WhatsApp

Join Now

Leave a Comment