టాలీవుడ్ ఇండస్ట్రీకి పెద్ద దిక్కు ఎవరంటే ఎవరి నోటెంట అయినా టక్కున వచ్చే పేరు మెగాస్టార్ చిరంజీవి అని.. దాసరి నారాయణ తరువాత ఆ బాధ్యతను చిరంజీవి ఎత్తుకున్నారంటారు. మరి అంతటి స్థానంలో ఉంటూ, దేశ వ్యాప్తంగా మంచి గుర్తింపున్న చిరంజీవి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. చిరంజీవి తన కుటుంబ వారసత్వాన్ని కొనసాగించడానికి మనవడు కావాలని ఇటీవల చేసిన వ్యాఖ్యలతో వివాదం చెలరేగింది. పబ్లిక్ ఫిగర్ వారసత్వంపై ఇలా మాట్లాడొచ్చా..? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
బ్రహ్మ ఆనందం
మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్కు హాజరైన చిరంజీవి సంచలన కామెంట్స్ చేశారు. హోస్ట్ అడిగిన ప్రశ్నలకు బదులిస్తూ ‘చుట్టూ ఆడపిల్లలతో నా ఇల్లు లేడీస్ హాస్టల్ లా ఉంటుంది. మగ పిల్లాడిని ఇవ్వమని చరణ్ కు చెప్పాను. వారసత్వాన్ని కొనసాగించాలని కోరిక నాకుంది. చరణ్ మళ్లీ ఆడపిల్లను కంటాడోనని భయం
‘ అని చిరంజీవి వ్యాఖ్యలు చేశారు.
చిరంజీవి కామెంట్స్ పై నెటిజన్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. లక్షలాది మంది ఫ్యాన్స్ను ప్రభావితం చేయగల స్థానంలో ఉన్న వ్యక్తి ఆడపిల్లలు, వారసత్వం గురించి మాట్లాడటం కరెక్ట్ కాదని అభిప్రాయం వ్యక్తమవుతోంది. చిరంజీవి ఇలా ఆలోచిస్తే సామాన్య ప్రజలు ఎలా ఆలోచిస్తారని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లింగ వివక్ష ఇంకెప్పుడు తగ్గుతుందని, చిరంజీవిపై చర్యలు తీసుకోవాలని మహిళా కమిషన్కు సైతం ఫిర్యాదులు అందుతున్నాయి. ‘చరణ్ మళ్లీ ఆడపిల్లను కంటాడోనని భయం
‘ అనే వ్యాఖ్య చిరంజీవి మనస్తత్వానికి అద్దం పడుతుందని, పబ్లిక్ ఫిగర్ ఇలాంటి ప్రకటనలు చేయకూడదని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.