శివలింగం వ‌ద్ద‌ మాంసపు ముద్ద‌.. సంచ‌ల‌నం

శివలింగం వ‌ద్ద‌ మాంసపు ముద్ద‌.. సంచ‌ల‌నం

హైద‌రాబాద్ టప్పాచబుత్రాలోని హనుమాన్ ఆలయంలో దారుణ‌మైన సంఘ‌ట‌న ఒక‌టి వెలుగుచూసింది. హ‌నుమాన్‌ ఆలయంలో ఉన్న శివలింగం వద్ద గుర్తు తెలియని వ్యక్తులు మాంసాన్ని వేసిన‌ ఘ‌ట‌న క‌ల‌క‌లం సృష్టించింది. దీంతో భ‌క్తులు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

ఈ విషయాన్ని గమనించిన‌ స్థానికులు హిందూ సంఘాలను సమాచారం అందించారు. హిందూ ధ‌ర్మ ప‌రిర‌క్ష‌ణ‌ సంఘాల‌ ప్రతినిధులు వెంట‌నే ఆలయానికి చేరుకుని ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దోషులను తక్షణమే గుర్తించి చర్యలు తీసుకోవాలని వారు పోలీసులను డిమాండ్ చేస్తున్నారు.

ఈ ఘ‌ట‌న‌పై స‌మాచారం అందుకున్న‌ పోలీసులు ఆలయానికి చేరుకొని అక్కడ ఉన్న సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు. ఈ ఘటనకు బాధ్యులు ఎవరో త్వరలోనే బయటపడే అవకాశముందని వెల్ల‌డించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment