మంచు ఫ్యామిలీలో రాజుకున్న నిప్పు ఇంకా చల్లారలేదు. టాలీవుడ్ నటుడు మంచు మనోజ్ (Manchu Manoj) మరోసారి పోలీస్ స్టేషన్ (Police Station)ను ఆశ్రయించారు. ఈసారి ఆయన చేసిన ఫిర్యాదు (Complaint) తన సొంత సోదరుడు మంచు విష్ణు (Manchu Vishnu) పైనే. మనోజ్ ఇచ్చిన వివరాల ప్రకారం.. తాను, తన ఫ్యామిలీ రాజస్థాన్ (Rajasthan) లో ఉన్న సమయంలో, విష్ణు సుమారు 150 మందితో కలిసి తన ఇంట్లోకి చొరబడి కార్లు, విలువైన వస్తువులు దొంగిలించడంతో పాటు భారీ విధ్వంసానికి పాల్పడ్డాడని ఆరోపించారు.
చోరీకి గురైన కార్లు విష్ణు ఆఫీస్లో లభ్యమయ్యాయని పేర్కొన్న మనోజ్, ఈ ఘటనపై తమ తండ్రి మోహన్ బాబు (Mohan Babu) స్పందించకపోవడం వల్లే తాను న్యాయం కోసం పోలీసులను (Police) ఆశ్రయించాల్సి వచ్చిందని చెప్పారు. ఈ సంఘటనతో మంచు కుటుంబంలోని వివాదాలు మరోసారి తెరపైకి వచ్చాయి. ఈ ఆరోపణల నేపథ్యంలో మంచు ఫ్యామిలీ భవిష్యత్తు ఎలా ఉండబోతుందనేది అభిమానుల్లో ఆసక్తిని రేపుతోంది.