దర్శకధీరుడు రాజమౌళి(SS Rajamouli) తెరకెక్కిస్తోన్న ప్రతిష్టాత్మక చిత్రం ‘SSMB29’ షూటింగ్ కోసం సూపర్ స్టార్ మహేశ్ బాబు(Mahesh Babu) మరియు పృథ్వీరాజ్ సుకుమారన్(Prithviraj Sukumaran) ఒడిశాకు బయల్దేరారు. ఈ సందర్భంగా బయటపడిన వారి కొత్త లుక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
మహేశ్ బాబు లాంగ్ హెయిర్ స్టైల్తో క్యాప్ ధరించి కనిపించగా, పృథ్వీరాజ్ క్లీన్ షేవ్లో మీసంతో ప్రత్యేకమైన లుక్లో దర్శనమిచ్చారు. వీరి లుక్స్ సినిమాపై మరింత క్యూరియాసిటీ పెంచుతున్నాయి.
అయితే, ఈ సినిమాలో పృథ్వీరాజ్ విలన్గా కనిపించనున్నారా? అనే ప్రశ్నపై ఫ్యాన్స్లో చర్చ మొదలైంది. ఈ విషయంపై అధికారిక ప్రకటన రాకపోయినా, ఇప్పటికే ఈ అంచనాలు ఫ్యాన్స్లో ఉత్సాహం నింపుతున్నాయి.