ఈడీ విచార‌ణ‌కు మహేశ్ బాబు.. కేసు ఏమిటంటే?

ఈడీ విచార‌ణ‌కు మహేశ్ బాబు.. కేసు ఏమిటంటే?

సూపర్ స్టార్ మహేశ్ బాబు (Mahesh Babu) నేడు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) (Enforcement Directorate, ED) విచారించనుంది. సాయిసూర్య (Sai Surya) మరియు సురానా ప్రాజెక్ట్స్ (Surana Projects) సంబంధిత ఆర్థిక వ్యవహారాలపై దర్యాప్తు కొనసాగుతుండగా, బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్న మహేశ్ బాబు త‌న ప్ర‌క‌ట‌న‌ల ద్వారా ప్రజలను పెట్టుబడులు పెట్టేలా ప్రభావితం చేశారని ఆరోపణలు ఎదురవుతున్నాయి.

ఇదే విషయంతో మహేశ్ బాబుకు ఇటీవల ఈడీ నోటీసులు పంపింది. హైద‌రాబాద్‌ (Hyderabad) బషీర్‌బాగ్‌లోని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్ ఆఫీస్‌లో మహేష్ బాబు మార్చి 28న విచారణకు హాజరు కావాలని నోటీసులో పేర్కొన్నారు. షూటింగ్ షెడ్యూల్ కారణంగా హాజరుకాలేక‌పోతున్నాన‌ని లేఖ ద్వారా ఈడీకి స‌మాచారం అందించారు. దీంతో, ఈరోజు విచారణకు హాజరు కావాలని మరోసారి ఈడీ ఆదేశించింది.

సాయి సూర్య డెవలపర్స్‌ ప్రమోషన్ కోసం మహేష్ బాబు రూ.5.90 కోట్లు తీసుకున్నట్లు ఈడీ అధికారుల త‌నిఖీల్లో బ‌య‌ట‌ప‌డింది. అందులో రూ.3.4 కోట్ల నగదు, రూ.2.5 కోట్ల RTGS ద్వారా మ‌హేశ్‌బాబు తీసుకున్నట్లుగా గుర్తించారు. ఈ విచారణలో ఏమి జరగబోతోంది? మహేశ్ బాబు స్పందన ఎలా ఉండబోతోంది? అన్నది సినీ మరియు రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ రేపుతోంది.

Join WhatsApp

Join Now

Leave a Comment