విజయవాడ శ్రీ కనకదుర్గ భక్తులకు మంత్రి నారా లోకేశ్ క్షమాపణలు చెప్పారు. దుర్గగుడి వద్ద తాగునీటి సమస్య నెలకొంది. దీంతో భక్తులు వీడియో రూపంలో రికార్డ్ చేసి సోషల్ మీడియా వేదికగా ట్విట్టర్ (X)లో పంచుకున్నారు. ఈ సమస్యను కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ మంత్రి నారా లోకేశ్ను ట్యాగ్ చేశారు.
లోకేశ్ క్షమాపణలు..
భక్తుల వీడియోకు స్పందించిన లోకేశ్, “భక్తులందరికీ ప్రభుత్వం తరఫున క్షమాపణలు చెబుతున్నాను. ఈ సమస్యను ఇప్పటికే గుర్తించి సంబంధిత శాఖకు తెలియజేశారు. భవిష్యత్లో ఇలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటాం” అని హామీ ఇచ్చారు.
భక్తుల వాదన
వీడియోలో భక్తులు గుడి వద్ద తాగునీటి సౌకర్యం లేకపోవడం తీవ్ర అసౌకర్యానికి దారితీస్తోందని, ఇది కూటమి సర్కారు పనితీరుకు ప్రతీకగా ఉందని విమర్శించారు. లోకేశ్ స్పందన తర్వాత భక్తులు తక్షణ చర్యల కోసం ఎదురుచూస్తున్నారు.