బిహార్ (Bihar) మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ (RJD) అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ (Lalu Prasad Yadav) (76) తీవ్ర అస్వస్థత (Critical illness) కు గురయ్యారు. పాట్నా (Patna) లోని పరాస్ ఆస్పత్రి (Paras Hospital) లో ఆయనకు అత్యవసర చికిత్స అందిస్తున్నారు. గత కొంతకాలంగా గుండె (heart) సంబంధిత సమస్యలతో బాధపడుతున్న లాలూ బుధవారం ఢిల్లీ వెళ్లేందుకు సిద్ధమయ్యారు. అయితే, విమానాశ్రయానికి వెళ్తుండగా ఆయన ఆరోగ్యం ఒక్కసారిగా క్షీణించడంతో వెంటనే ఆసుపత్రికి తరలించారు.
మళ్లీ అనారోగ్యం
లాలూ ప్రసాద్ అనారోగ్య సమస్యలు కొత్తవి కావు. గతంలో కూడా ఆయన అనేక ఆరోగ్య సమస్యలను ఎదుర్కొన్నారు. 2022లో సింగపూర్ (Singapore) లో కిడ్నీ మార్పిడి (Kidney Transplant) శస్త్రచికిత్స చేయించుకున్న ఆయన, గతేడాది ముంబైలో యాంజియోప్లాస్టీ నిర్వహించుకున్నారు. 2014లో ఓపెన్ హార్ట్ సర్జరీ (Open-Heart Surgery) కూడా చేయించుకున్నారు. ఇదిలా ఉంటే, భూముల కోసం ఉద్యోగాలు ఇచ్చారన్న అవినీతి కేసులో లాలూ కుటుంబంపై విచారణ కొనసాగుతోంది. ఇటీవల ఈడీ ఆయనను నాలుగు గంటలపాటు ప్రశ్నించింది. లాలూ ప్రసాద్ ఆరోగ్యంపై ఆర్జేడీ వర్గాల్లో ఆందోళన నెలకొంది. ఎయిర్ అంబులెన్స్ ద్వారా లాలూను ఢిల్లీ ఎయిమ్స్కి (Delhi AIIMS) తరలించే అవకాశం ఉన్నట్లు సమాచారం.