కుప్పంలో మహిళపై దాడి.. ఎన్‌హెచ్‌ఆర్‌సీ సీరియస్

కుప్పంలో మహిళపై దాడి.. ఎన్‌హెచ్‌ఆర్‌సీ సీరియస్

ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh)లోని చిత్తూరు జిల్లా (Chittoor District) కుప్పం నియోజ‌క‌వ‌ర్గం (Kuppam Constituency)లో జ‌రిగిన ఒక దారుణ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. త‌న భ‌ర్త (Husband) చేసిన అప్పు (Loan) తిరిగి చెల్లించ‌లేద‌ని మ‌హిళ‌ (Woman)ను చెట్టు (Tree)కు క‌ట్టేసి కొట్టిన ఘ‌ట‌న ముఖ్య‌మంత్రి (Chief Minister) చంద్ర‌బాబు (Chandrababu) నియోజ‌క‌వ‌ర్గంలో జ‌ర‌గ‌డంతో దేశ వ్యాప్తంగా విమ‌ర్శ‌లు వ్య‌క్తమ‌య్యాయి.

ఈనెల 16వ తేదీన జ‌రిగిన ఈ ఘ‌ట‌నపై జాతీయ మాన‌వ‌హ‌క్కుల తీవ్రంగా స్పందించింది. 25 ఏళ్ల మహిళ శిరీషను ఆమె భర్త తీసుకున్న రూ. 80,000 అప్పు తీర్చలేకపోవడంతో అధికార పార్టీకి చెందిన‌ స్థానిక నేత మునికన్నప్ప (Munikannappa), అతని కుటుంబ సభ్యులు ఆమెను వేపచెట్టుకు కట్టేసి కొట్టిన ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ అమానవీయ చర్య దేశ వ్యాప్తంగా చ‌ర్చనీయాంశ‌మైంది. దీనిపై జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్‌హెచ్‌ఆర్‌సీ) (NHRC) సుమోటోగా కేసు విచారణకు తీసుకుంది. ఈ ఘటన మానవ హక్కుల ఉల్లంఘనగా భావించిన ఎన్‌హెచ్‌ఆర్‌సీ, రెండు వారాల్లోగా వివరణాత్మక నివేదిక సమర్పించాలని ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ (Andhra Pradesh Chief Secretary), డీజీపీ (DGP)లకు నోటీసులు జారీ చేసింది.

శిరీష (Sirisha) తన పిల్లల బదిలీ స్కూల్ సర్టిఫికెట్ కోసం బెంగళూరు నుంచి నారాయణపురం గ్రామానికి వచ్చినప్పుడు మునికన్నప్ప, అతని భార్య వెంకటమ్మ, కొడుకు రాజా, కోడలు జగదీశ్వరి ఆమెను రోడ్డుపై ఈడ్చి, చెట్టుకు కట్టి దాడి చేశారని పోలీసులు తెలిపారు. శిరీష భర్త తిమ్మరాయప్ప మూడేళ్ల క్రితం మునికన్నప్ప వద్ద రూ. 80,000 అప్పు తీసుకుని, తిరిగి చెల్లించలేక గ్రామాన్ని వదిలి వెళ్లిపోయాడు. శిరీష రోజువారీ కూలీగా పనిచేస్తూ ముగ్గురు పిల్లలను పోషిస్తూ, అప్పును క్రమంగా తీర్చడానికి ప్రయత్నిస్తోంది. అయినప్పటికీ, ఈ దాడి జరిగినట్లు సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియో ద్వారా తెలిసింది, దీనిపై దేశ‌ వ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. దీనిపై రాష్ట్ర ప్ర‌భుత్వం కూడా స్పందించింది.

Join WhatsApp

Join Now

Leave a Comment