‘గుప్పెడన్నం కోసం గుండెలవిసేలా రోదించడమా..’ గురుకులాల‌పై కేటీఆర్ ట్వీట్

'గుప్పెడన్నం కోసం గుండెలవిసేలా రోదించడమా..' గురుకులాల‌పై కేటీఆర్ ట్వీట్

గురుకులాల్లో ఆక‌లి కేక‌ల‌పై, విద్యార్థుల అవ‌స్థ‌ల‌పై బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ చేసిన ట్వీట్ ప్ర‌స్తుతం తెలంగాణ రాజ‌కీయాల్లో చ‌ర్చ‌నీయాంశ‌మైంది. విద్యార్థులు అన్నం అడిగితే బిచ్చ‌పోల్లు అంటూ తిడుతున్నార‌ని ఓ విద్యార్థినీ క‌న్నీరు పెట్టుకున్న‌ వీడియోను కేటీఆర్ త‌న ట్వీట్‌కు జ‌త చేశారు. అన్నపూర్ణ నా తెలంగాణలో.. బువ్వకోసం బిడ్డల ఏడ్పులా అంటూ రేవంత్ ప్ర‌భుత్వంపై తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. కేటీఆర్‌.

కోటీ 53 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండిన నా తెలంగాణలో పట్టెడన్నం కోసం పసిబిడ్డల ఆర్తనాదాలా! దశాబ్దాల కాంగ్రెస్ పాలన మూలంగా ఆకలిచావులు, ఆత్మహత్యలు, వలసలు, అంబలికేంద్రాలకు నిలయమైన తెలంగాణను పదేళ్ల కేసీఆర్ గారి పాలనలో దేశానికే అన్నపూర్ణగా నిలిపాం. ఏడాది కాంగ్రెస్ పాలనలో అన్నమో రామచంద్రా అని ఆకలికేకలా ! పదేళ్ల కేసీఆర్ పాలనలో గురుకులాల్లో చదువుకుని ఎవరెస్ట్ శిఖరాలు అధిరోహించి, వందశాతం ఉత్తీర్ణత సాధించి ప్రతిభ చాటిన విద్యార్థులు .. నేడు గుప్పెడన్నం కోసం గుండెలవిసేలా రోదించడమా ! సిగ్గు సిగ్గు‘ అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు.

పాల‌కుల పాపం, విద్యార్థుల‌కు శాపంగా మారింద‌ని కేటీఆర్ చేసిన ట్వీట్ కింద తెలంగాణ వాదులు ఆ విద్యార్థుల‌కు మ‌ద్ద‌తుగా ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. ఓయూ జేఏసీ నేత‌ల‌కు ఈ విద్యార్థుల క‌ష్టాల‌పై పోరాటం చేసే స‌మ‌యం లేదా అని కొంద‌రు ప్ర‌శ్నిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment