బీఆర్ఎస్ (BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR)తో పాటు ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ (Mutha Gopal) పై నమోదైన కేసు (Case)ను నాంపల్లి ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టు (Special Court) కొట్టివేసింది (Dismissed). ముషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ కేసు నమోదైన విషయం తెలిసిందే. అనుమతి లేకుండా ప్రచార కార్యక్రమం నిర్వహించినట్లు కేటీఆర్, ముఠా గోపాల్పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో చట్టబద్ధంగా వ్యతిరేకిస్తూ కేటీఆర్, ముఠా గోపాల్ తెలంగాణ హైకోర్టు (Telangana High Court) ను ఆశ్రయించారు. కేసును కొట్టివేయాలంటూ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు.
ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు, కేసు రద్దు చేయాలని ప్రజాప్రతినిధుల కోర్టుకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు ఉత్తర్వులను న్యాయవాది జక్కుల లక్ష్మణ్ (Jakkula Lakshman) కోర్టులో సమర్పించడంతో, న్యాయమూర్తి శ్రీదేవి (Sridevi) కేసును కొట్టివేస్తున్నట్లుగా తుది తీర్పు వెల్లడించారు. ప్రజాప్రతినిధుల కోర్టు తీర్పుతో కేటీఆర్, ముఠా గోపాల్కు ఉపశమనం లభించింది.