“భయపడను, అరెస్ట్ చేస్తారని ముందే తెలుసు”: కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

"భయపడను, అరెస్ట్ చేస్తారని ముందే తెలుసు": కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

ఫార్ములా ఈ కార్ రేసు (Formula E Car Race) కేసు (Case)లో రెండోసారి ఏసీబీ (ACB) విచారణకు హాజరయ్యే ముందు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు (కేటీఆర్)(KTR) కీలక వ్యాఖ్యలు చేశారు. డైవర్షన్ పాలిటిక్స్‌ (Diversion Politics)లో భాగంగా తనపై ఈ అక్రమ కేసు (Illegal Case) పెట్టారని, ఇలాంటి కేసులో జైలు(Jail)కు వెళ్ళేందుకు కూడా తాను సిద్ధంగా(Ready) ఉన్నానని సోమవారం తెలంగాణ భవన్‌ (Telangana Bhavan) వద్ద ఆయన ప్రకటించారు.

“అరెస్ట్ చేసినా భయపడను.. వెనక్కి తగ్గను”
“పైశాచిక ఆనందం పొందేందుకు మాత్రమే నా పైన కేసులు పెడుతున్నారు. ఆరు నెలలుగా విచారించి ఏం తేల్చారు? ఫార్ములా ఈ-రేస్ కేసులో అరెస్ట్ చేస్తారని నాకు ముందే తెలుసు. అరెస్ట్(Arrest) చేసినా కూడా భయపడను, వెనక్కి తగ్గను. జైలుకు వెళ్లేందుకు కూడా సిద్ధం. నాకు జైలు కొత్తేమీ కాదు. తెలంగాణ కోసం అనేక సార్లు జైలుకు వెళ్ళిన వ్యక్తిని నేను” అని కేటీఆర్ స్పష్టం చేశారు.

ఫార్ములా ఈ-రేసు అంశంపై నాలుగు గోడల మధ్య తనను విచారించడం కాదని, అసెంబ్లీ సాక్షిగా నాలుగు కోట్ల ప్రజల ముందు చర్చిద్దామని తాను చెబుతున్నానని ఆయన అన్నారు. “చర్చించే దమ్ము, ధైర్యం లేక రేవంత్ రెడ్డి పారిపోయారు. రేవంత్‌కు ఇదే నా సవాల్.. లై డిటెక్టర్ టెస్ట్‌కు కూడా నేను సిద్ధమే” అని కేటీఆర్ సవాల్ విసిరారు.

కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ విమర్శలు
ముఖ్యమంత్రి (Chief Minister) రేవంత్ రెడ్డి (Revanth Reddy)పై విమర్శలు గుప్పిస్తూ, “అందాల పోటీలు పెట్టి ప్రపంచం ముందు అభాసుపాలు చేసిన వ్యక్తి రేవంత్ రెడ్డి” అని కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చెప్పుకునేందుకు ఏమీ లేదని, రైతుబంధు పథకాన్ని కాస్త ఎలక్షన్ బంధుగా మార్చేశారని ఆరోపించారు. తమపై పెట్టిన కేసు కేవలం డైవర్షన్ పాలిటిక్స్‌లో భాగమేనని పునరుద్ఘాటించారు. “మాకు చట్టం, కోర్టు అంటే గౌరవం ఉంది. అందుకే మూడు సార్లు కాదు, 30 సార్లు పిలిచినా విచారణకు వెళ్తాను” అని ఆయన పేర్కొన్నారు.

బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ఇవ్వకుండానే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తున్నారని, బీసీలన్నీ గమనిస్తున్నాయని కేటీఆర్ హెచ్చరించారు. “మీరు ఇచ్చిన హామీలు అమలు చేసే వరకు ప్రజల వైపు ఉండి నిలదీస్తూనే ఉంటాం. దున్నపోతు ఈనింది అంటే దూడనీ కట్టేయమని బీజేపీ అంటుంది. కాంగ్రెస్-బీజేపీవి దొంగాటలు. ఆరు గ్యారెంటీలు, 420 హామీలు అమలు అయ్యే వరకు ప్రభుత్వాన్ని నిలదీస్తూనే ఉంటాం” అని కేటీఆర్ ఉద్ఘాటించారు. “జై తెలంగాణ” అంటూనే ఆయన ఏసీబీ కార్యాలయానికి బయల్దేరారు.

ఏసీబీ విచారణకు ముందు కేటీఆర్ షెడ్యూల్
అంతకుముందు, ఉదయం కోకాపేటలోని తన నివాసం నుంచి కేటీఆర్ నందినగర్‌లోని తన నివాసానికి చేరుకున్నారు. అక్కడ హరీష్ రావు, మరికొందరు పార్టీ నేతలతో కలిసి పార్టీ అధినేత కేసీఆర్‌తో భేటీ అయ్యారు. ఆ తర్వాత భారీ ర్యాలీగా తెలంగాణ భవన్‌కు చేరుకుని మీడియాతో మాట్లాడిన అనంతరం ఏసీబీ కార్యాలయానికి బయల్దేరారు.

Join WhatsApp

Join Now

Leave a Comment