హైదరాబాద్ నగరంలోని తెలంగాణ భవన్ వద్ద పోలీసు బలగాలను భారీగా మోహరించారు. ఈ చర్యకు కారణం మాజీ మంత్రి కేటీఆర్పై నమోదైన కేసు. ఫార్ములా ఈ-కార్ రేసు కేసు నేపథ్యంలో అవినీతి నిరోధక బృందం (ఏసీబీ) ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది.
బంజారాహిల్స్ ఏసీబీ కార్యాలయంలో ఏసీబీ డీజీ విజయ్ కుమార్ కీలక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అధికారులతో కలిసి కేసుపై వివరాలు చర్చించినట్లు సమాచారం. అధికార వర్గాల ప్రకారం, ఎస్పీ స్థాయి అధికారి ఆధ్వర్యంలో ఈ కేసుపై లోతైన విచారణ చేపట్టే అవకాశం ఉంది.
తెలంగాణ భవన్ వద్ద పోలీసు బందోబస్తు తీవ్రతకు సంబంధించి అధికారిక సమాచారం ఇంకా వెల్లడి కాలేదు. కేసు పురోగతిపై త్వరలో మరింత వివరాలు వెలుగులోకి రానున్నాయి. కాగా, ఫార్ములా -ఈ రేస్ కేసులో కేటీఆర్ను అరెస్టు చేస్తారా అన్న అనుమానం బీఆర్ఎస్ నేతల్లో కలుగుతోంది.