ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కృష్ణా జిల్లాలోని మచిలీపట్నంలో ఒక విషాదకరమైన సంఘటన చోటు చేసుకుంది. తన తండ్రి వద్దకు వెళ్లి ఇంటికి తిరిగి వస్తున్న మైనర్ బాలికపై రాజుపేటకు చెందిన నలుగురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. నడుచుకుంటూ వెళ్తున్న బాలికను ఇద్దరు యువకులు బెదిరించి బైకుపై ఎక్కించుకుని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లారు. అక్కడ ఇప్పటికే మరొక ఇద్దరు యువకులు ఉన్నారు.
అక్కడ ఆమెను నలుగురు యువకులు హింసించి, లైంగిక దాడికి పాల్పడ్డారు. అయితే, బాలిక తీవ్రంగా కేకలు వేసింది, దీంతో నలుగురు నిందితులు అక్కడి నుంచి పారిపోయారు. బాలిక ఆ యువకుల నుంచి ప్రాణాలతో తప్పించుకున్న తర్వాత, బాధితురాలు తన తల్లికి విషయాన్ని చెప్పింది. బాధితురాలి తల్లి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకునేందుకు పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు.