ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో అమరావతి (Amaravati) మహిళలపై (Women) అనుచిత వ్యాఖ్యల (Inappropriate Comments) కేసులో అరెస్టైన సీనియర్ జర్నలిస్ట్ (Senior Journalist) కొమ్మినేని శ్రీనివాసరావు (కేఎస్ఆర్) (Kommineni Srinivasa Rao) నేడు గుంటూరు జిల్లా (Guntur District) జైలు(Jail) నుంచి విడుదల (Release) కానున్నారు. ఈ కేసు రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్గా మారడంతో, సుప్రీంకోర్టు (Supreme Court) జోక్యంతో కీలక పరిణామం చోటుచేసుకుంది. జూన్ 9న హైదరాబాద్ (Hyderabad)లోని తన నివాసంలో అరెస్టైన కొమ్మినేని, రెండవ నిందితుడిగా (A2) నమోదై, జూన్ 10న మంగళగిరి కోర్టు (Mangalagiri Court) 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. కొమ్మినేని అరెస్ట్ను తీవ్రంగా ఖండించిన సుప్రీం కోర్టు.. ఆయన్ను వెంటనే విడుదల చేయాలని సర్వోన్నత న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది.
ఈ కేసు నేపథ్యంలో, కొమ్మినేని జూన్ 6న సాక్షి టీవీ (Sakshi TV)లో నిర్వహించిన డిబేట్ (Debate)లో ఒక ప్యానలిస్ట్ (Panelist) చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. కొమ్మినేని ఆ వ్యాఖ్యలను ఖండించకుండా నవ్వడం ద్వారా నేరానికి పాల్పడ్డారని ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఆరోపించారు. అయితే, కొమ్మినేని తరఫు న్యాయవాది సీనియర్ అడ్వకేట్ సిద్ధార్థ్ దవే (Senior Advocate Siddharth Dave), ఆయన స్వయంగా ఆ వ్యాఖ్యలు చేయలేదని, జర్నలిస్ట్గా ఆయన స్వేచ్ఛా హక్కులను కాపాడాలని సుప్రీంకోర్టులో వాదించారు. న్యాయవాది వ్యాఖ్యలతో ఏకీభవిస్తూ నవ్వితే కేసు పెట్టడం ఏంటీ..? కేసుల విచారణ సందర్భంలో తాము నవ్వుతుంటామని దేశ అత్యున్నత న్యాయస్థానం సీరియస్ కామెంట్స్ చేసింది. పోలీసుల చర్యను తప్పుబడుతూ ఏపీ ప్రభుత్వానికి పలు ప్రశ్నలు వేసింది.
సుప్రీంకోర్టు జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ మన్మోహన్ ధర్మాసనం జూన్ 13న ఈ కేసును విచారించి, కొమ్మినేని చేసినది నేరం కాదని, ఆయన జర్నలిస్ట్గా పనిచేసే హక్కును, వాక్ స్వాతంత్ర్యాన్ని కాపాడాలని ఆదేశించింది. ఈ తీర్పుతో కొమ్మినేని నేడు జైలు నుంచి విడుదలవుతున్నారు. ఈ ఘటన రాష్ట్రంలో రాజకీయంగా కూడా చర్చనీయాంశంగా మారింది. వైసీపీ అధ్యక్షుడు (YSRCP President) వైఎస్ జగన్మోహన్ రెడ్డి (Y.S. Jagan Mohan Reddy) ఈ అరెస్టును “అప్రజాస్వామిక చర్య”గా విమర్శిస్తూ, సుప్రీంకోర్టు తీర్పును స్వాగతించిన విషయం తెలిసిందే.