ట్రైనీ డాక్ట‌ర్‌ హత్యాచార కేసులో బిగ్ ట్విస్ట్

ట్రైనీ డాక్ట‌ర్‌ హత్యాచార కేసులో బిగ్ ట్విస్ట్

కోల్‌కతా ఆర్జీకర్ ప్రభుత్వ వైద్య కళాశాలలో వైద్యురాలి హత్యాచార కేసు కొత్త మలుపు తిరిగింది. ఈ కేసులో దోషిగా తేలిన సంజయ్ రాయ్‌కు జీవిత ఖైదుతోపాటు రూ. 50,000 జరిమానా విధిస్తూ కోర్టు తీర్పునిచ్చిన నేపథ్యంలో, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. సీల్దా కోర్టు తీర్పును సవాలు చేస్తూ ప్ర‌భుత్వం హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. హైకోర్టు రిజిస్ట్రీ త్వరలో విచారణ తేదీలను ప్రకటించనుంది.

న్యాయస్థాన తీర్పు వివరాలు
న్యాయమూర్తి అనిర్బన్ దాస్ నేతృత్వంలోని కోర్టు, సంజయ్ రాయ్‌కు జీవిత ఖైదుతో పాటు రూ. 50 వేల జరిమానా విధించింది. అలాగే, బాధిత కుటుంబానికి రూ. 17 లక్షల పరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయితే, ఈ తీర్పుపై ప్రభుత్వం అసంతృప్తిగా ఉండటంతో మరింత కఠినమైన శిక్ష విధించాలని హైకోర్టులో పిటిషన్ వేసింది.

ప్రభుత్వ స్పందన
పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఈ ఘటనపై సీరియస్‌గా స్పందిస్తూ, బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా అన్ని చట్టపరమైన మార్గాలను అన్వేషిస్తామని స్పష్టం చేసింది. సంజయ్ రాయ్‌కు మరింత కఠినమైన శిక్ష కోసం ప్రభుత్వం ప్రయత్నాలు ముమ్మరం చేసింది.

Join WhatsApp

Join Now

Leave a Comment