భారత క్రికెట్ సూపర్స్టార్ విరాట్ కోహ్లీ (Virat Kohli) 12 ఏళ్ల తర్వాత రంజీ ట్రోఫీ (Ranji Trophy) బరిలో అడుగుపెట్టాడు. కోహ్లీ బ్యాటింగ్ను ప్రత్యక్షంగా చూడాలనే ఉత్సాహంతో అరుణ్ జైట్లీ స్టేడియం కి వేలాదిమంది అభిమానులు (Kohli Fans) తరలివచ్చారు. అంతర్జాతీయ మ్యాచ్ల స్థాయిలో ఈ ఫస్ట్క్లాస్ క్రికెట్ మ్యాచ్కు మద్దతు దక్కింది.
అయితే, కోహ్లీ రీఎంట్రీపై అంచనాలు భారీగా ఉన్నా, ఫలితం మాత్రం నిరాశే. రైల్వేస్తో జరిగిన మ్యాచ్లో కేవలం 15 బంతులు ఎదుర్కొని, ఒకే ఒక్క ఫోర్తో 6 పరుగులు చేసి క్లీన్బౌల్డ్ అయ్యాడు. పేసర్ హిమాన్షు సంగ్వాన్ బౌలింగ్లో కోహ్లీ ఆఫ్ స్టంప్ బంతిని ఆడబోయి మిస్ చేసుకుని వికెట్ సమర్పించుకున్నాడు.
ఆసీస్లోనూ అదే పరిస్థితి..
ఇటీవల టెస్టు క్రికెట్లో కోహ్లీ ఫామ్ కోల్పోయినట్లు అనిపిస్తోంది. బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో అద్భుత శతకం బాదినప్పటికీ, ఆ తర్వాత అంతర్జాతీయ క్రికెట్లో స్థిరమైన ప్రదర్శన చూపలేకపోయాడు. ఆఫ్ స్టంప్ బంతులకు వికెట్ సమర్పించడం అతని ప్రధాన సమస్యగా మారింది. అతని రంజీ రీఎంట్రీపై అభిమానులు ఎంతో ఆశలు పెట్టుకున్నప్పటికీ, మొదటి ఇన్నింగ్స్లో అతని వికెట్ ఒత్తిడిని పెంచేసింది. మరి, కోహ్లీ మళ్లీ తన పాత ఫామ్ను అందుకుంటాడా? రంజీలో మిగిలిన మ్యాచుల్లో తన క్లాస్ను మరోసారి నిరూపించుకుంటాడా? వేచి చూడాలి!