‘నాకు న్యాయం చేయండి..’ – ప‌వ‌న్‌కు కిరణ్ రాయ‌ల్ బాధితురాలి వేడుకోలు

'నాకు న్యాయం చేయండి..' - ప‌వ‌న్‌కు కిరణ్ రాయ‌ల్ బాధితురాలి వేడుకోలు

జనసేన నేత కిరణ్ రాయల్ త‌న‌ను మోసం చేశాడ‌ని, డ‌బ్బులు తీసుకొని తిరిగి ఇవ్వ‌మ‌ని అడిగినందుకు త‌న పిల్ల‌ల‌ను, త‌న‌ను చంపుతాన‌ని బెదిరిస్తున్నాడ‌ని బాధితురాలు ల‌క్ష్మి సంచ‌ల‌న వీడియో విడుద‌ల చేసిన విష‌యం తెలిసిందే. తాజాగా నిర్వ‌హించిన మీడియా స‌మావేశంలో కిర‌ణ్ రాయ‌ల్ నుంచి త‌న‌ను ర‌క్షించాల‌ని ప్ర‌భుత్వాన్ని, డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ను వేడుకుంది.

ఆడ‌బిడ్డ‌కు అన్యాయం జ‌రిగితే తాను అండ‌గా ఉంటాన‌ని ఎన్నిక‌ల స‌మ‌యంలో ప్ర‌క‌టించిన డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ త‌న‌కు న్యాయం చేయాల‌ని ల‌క్ష్మి వేడుకుంది. భ‌విష్య‌త్తులో మ‌రింత మంది కిర‌ణ్‌రాయ‌ల్ బాధితులు బ‌య‌ట‌కు వ‌స్తార‌ని చెప్పింది. తాను మాత్రమే కాకుండా, అనేక మంది అమ్మాయిలను కిరణ్ మోసం చేశాడని ఆమె ఆరోపించింది.

జ‌న‌సేన పార్టీ నేత‌లు కిర‌ణ్ రాయ‌ల్ త‌న వ‌ద్ద డ‌బ్బులు తీసుకొని మోసం చేశాడ‌ని, రూ.1.20 కోట్లకు బెదిరించి, భ‌య‌పెట్టి రూ.30 ల‌క్ష‌ల‌కు చెక్కులు, బాండ్లు రాయించాడ‌ని ల‌క్ష్మి త‌న సెల్ఫీ వీడియోలో వెల్ల‌డించిన విష‌యం తెలిసిందే. ల‌క్ష్మిని బూతులు తిడుతూ, బెదిరింపుల‌కు పాల్ప‌డిన కిరణ్ రాయ‌ల్ ఆడియోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారిన విష‌యం తెలిసిందే.

Join WhatsApp

Join Now

Leave a Comment