పహల్గామ్ (Pahalgam) ఉగ్రదాడి (Terrorist Attack)పై కాంగ్రెస్ చీఫ్ (Congress Chief) మల్లికార్జున ఖర్గే (Mallikarjun Kharge) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉగ్రదాడి గురించి ప్రధాని నరేంద్ర మోడీ (Prime Minister Narendra Modi)కి ముందే సమాచారం (Prior Information) అందినట్లు కీలక కామెంట్స్ చేశారు. మోడీకి ఈ దాడి జరగడానికి మూడు రోజుల ముందు ఇంటెలిజెన్స్ సమాచారం అందించిందని, అందుకే ప్రధాని తన కాశ్మీర్ పర్యటనను రద్దు చేసుకున్నారని తాను ఓ వార్త కథనాన్ని చదివానని సంచలన కామెంట్స్ చేశారు. జార్ఖండ్ (Jharkhand) లో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన సంవిధాన్ బచావో ర్యాలీ (Samvidhan Bachao Rally) లో పాల్గొన్న ఖర్గే.. ర్యాలీ అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంగళవారం మాట్లాడారు.
ఇంటెలిజెన్స్ వైఫల్యం : ఖర్గే
“ఈ దాడి జరిగినప్పుడు ఇంటెలిజెన్స్ (Intelligence) విఫలమైందని ప్రభుత్వం అంగీకరించింది. ఒకవేళ వారికి ముందే ఈ విషయం తెలిస్తే, ఎందుకు భద్రతా చర్యలు తీసుకోలేదు? అని మల్లికార్జున ఖర్గే ప్రశ్నించారు. ఇంటెలిజెన్స్ నివేదిక అందినప్పుడు భద్రతాబలగాలను ఎందుకు అలర్ట్ చేయలేదు?” అని ఖర్గే ప్రధాని మోడీని ప్రశ్నించారు. ఉగ్రదాడిలో మొత్తం 26 మంది ప్రాణాలు కోల్పోయారని, ఈ దాడిలో నిఘా వర్గాలు విఫలమయ్యానన్నారు. అనంతరం, కేంద్ర ప్రభుత్వం అన్ని రాజకీయ పార్టీలతో అఖిల పక్ష భేటీ నిర్వహించిందని గుర్తుచేశారు.