కేరళ (Kerala)కు చెందిన నర్సు నిమిషా ప్రియ (Nimisha Priya) మరణశిక్ష అంశంపై సుప్రీంకోర్టు (Supreme Court)కు అటార్నీ జనరల్ (Attorney General) కీలక సమాచారం అందించారు. యెమెన్ (Yemen)లో ప్రస్తుతం భారతీయ నర్సు నిమిషా ప్రియ ఉరిశిక్ష నిలిచివేయబడిందని, ప్రతికూలంగా ఏమీ జరగలేదని సుప్రీంకోర్టుకు కేంద్రం తరపున హాజరైన అటార్నీ జనరల్ ఆర్ వెంకటరమణి (R.Venkataramani) తెలిపారు. న్యాయమూర్తులు విక్రమ్ నాథ్, సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం ముందు ఆయన ఈ వివరాలు సమర్పించారు. ఈ విషయంలో కొత్త మధ్యవర్తి రంగంలోకి వచ్చారని కూడా పేర్కొన్నారు.
నర్సు నిమిషా ప్రియను రక్షించడానికి దౌత్య మార్గాలను ఉపయోగించాలని కేంద్రాన్ని ఆదేశించాల్సిందిగా కోరుతూ దాఖలైన పిటిషన్ను గురువారం సుప్రీంకోర్టు విచారించింది. ఈ సందర్భంగా నిమిషా ప్రియ ఉరిశిక్ష ఏమైందని ధర్మాసనం ప్రశ్నించగా, అటార్నీ జనరల్ ఆర్. వెంకటరమణి పై విధంగా సమాధానమిచ్చారు. నిమిషా ప్రియ ఉరిశిక్ష ప్రస్తుతం నిలిచిపోయిందని, ఎటువంటి ప్రతికూల సంఘటనలు జరగడం లేదని ఆయన సుప్రీంకోర్టుకు తెలియజేశారు.
నిమిషా ప్రియ 2008లో యెమెన్కు వెళ్లి అక్కడ నర్సుగా పని చేసింది. తలాల్ అబ్డో సాయంతో ఆమె ఒక క్లినిక్ను ఏర్పాటు చేసింది. అయితే, తలాల్ నర్సును వేధించడం ప్రారంభించాడని నిమిషా న్యాయవాది తెలిపారు. అతడి నుంచి తప్పించుకోవడానికి నిమిషా.. తలాల్కు మత్తు మందు ఇచ్చింది. అది అతని మరణానికి దారితీసింది. ఈ కేసులో ఆగస్టులో ఆమెకు ఉరిశిక్ష పడింది. దౌత్య ప్రయత్నాల కారణంగా ప్రస్తుతం ఆమె ఉరిశిక్ష నిలిచిపోయిందని కథనం సారాంశం.








