హైద‌రాబాద్ ఏఐజీ ఆస్ప‌త్రికి కేసీఆర్

హైద‌రాబాద్ ఏఐజీ ఆస్ప‌త్రికి కేసీఆర్

బీఆర్ఎస్ (BRS) పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (Kalvakuntla Chandrashekar Rao) (కేసీఆర్) గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రి (AIG Hospital) కి వెళ్లారు. సాధారణ ఆరోగ్య పరీక్షల నిమిత్తంగా ఆయన ఆసుపత్రిని సందర్శించినట్టు సమాచారం. ఇటీవల కూడా ఆరోగ్య పరీక్షల కోసం అదే ఆసుపత్రికి వెళ్లిన కేసీఆర్, ఈసారి మరిన్ని టెస్టులు (Tests) చేయించుకున్నట్టు తెలుస్తోంది.

త్వ‌ర‌లో వరంగల్‌ (Warangal) లో జరగనున్న బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ వేడుకల (Silver Jubilee Celebrations) నేపథ్యంలో తన ఫామ్ హౌస్‌ (Farmhouse) లో ఉమ్మడి జిల్లాల నేతలతో కేసీఆర్ వరుసగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. పార్టీ కార్యాచరణలో పూర్తిగా చురుగ్గా పాల్గొంటున్నప్పటికీ, తన ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకుంటూ పరీక్షలు చేయించుకుంటుండటం గమనార్హం.

సిల్వ‌ర్ జూబ్లీ వేడుక‌ల‌ను ఘ‌నంగా నిర్వ‌హించేందుకు బీఆర్ఎస్ స‌న్న‌ద్ధ‌మవుతోంది. బీఆర్ఎస్ సీనియ‌ర్ లీడ‌ర్లు కేటీఆర్‌ (KTR), హ‌రీశ్ రావు (Harish Rao) ఇందుకు సంబంధించిన స‌న్నాహ‌క స‌మావేశాలు నిర్వ‌హిస్తూ క్యాడ‌ర్‌ను ఉత్తేజ‌ప‌రుస్తున్నారు. ఈ స‌మావేశంలో కేసీఆర్ ప‌వ‌ర్ ఫుల్ స్పీచ్‌తో మ‌ళ్లీ పొలిటిక‌ల్ రీఎంట్రీ ఇవ్వ‌నున్న‌ట్లుగా స‌మాచారం.

Join WhatsApp

Join Now

Leave a Comment