నేడు తెలంగాణ (Telangana) రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకోనుంది. మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధ్యక్షుడు (BRS President) కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్) (K. Chandrashekar Rao) ఈ రోజు కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్కు (Kaleshwaram Lift Irrigation) సంబంధించిన విచారణ కమిషన్ (Inquiry Commission) ఎదుట హాజరుకానున్నారు. జస్టిస్ పీసీ ఘోష్ (Justice P.C. Ghose) నేతృత్వంలోని ఈ కమిషన్, కాళేశ్వరం ప్రాజెక్టులో ఆరోపిత అవకతవకలు, నిర్మాణ లోపాలపై విచారణ జరుపుతోంది. కేసీఆర్(KCR) ఈ విచారణలో ఇచ్చే సమాధానాలపై రాష్ట్ర రాజకీయ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. మేడిగడ్డ (Medigadda), అన్నారం (Annaram), సుందిళ్ల (Sundilla) బ్యారేజీలలో (Barrages) నిర్మాణ లోపాలు, ఆర్థిక అక్రమాల ఆరోపణల నేపథ్యంలో కమిషన్ కేసీఆర్ను ప్రశ్నించనుంది.
ఇటీవల మాజీ మంత్రులు ఈటల రాజేందర్ (Etela Rajender), తన్నీరు హరీశ్ రావు (Tanniru Harish Rao) ఈ కమిషన్ ఎదుట హాజరై వాంగ్మూలాలు సమర్పించారు. వారి సమాచారం ఆధారంగా, కాళేశ్వరం ప్రాజెక్టు ఆమోదం, మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు, బ్యారేజీల నిర్మాణంలో తీసుకున్న నిర్ణయాలు, డిజైన్ మార్పులు, ఖర్చు పెరుగుదల వంటి అంశాలపై కేసీఆర్ను ప్రశ్నించే అవకాశం ఉంది. ముఖ్యంగా, మేడిగడ్డ బ్యారేజీ స్తంభాలు కుంగిపోవడం, ఇతర బ్యారేజీలలో లీకేజీలు గుర్తించడం వంటి సాంకేతిక సమస్యలపై కమిషన్ వివరణ కోరనుంది.
బీఆర్ఎస్ నేతలు ఇది రాజకీయ కుట్రగా అభివర్ణిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government) రాజకీయ కక్షసాధింపు కోసం ఏర్పాటు చేసిందని ఆరోపిస్తున్నారు. కేసీఆర్ కుమార్తె, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) ఈ విచారణను “కాంగ్రెస్ కమిషన్” (Congress Commission)గా విమర్శిస్తూ, కేసీఆర్ను రాజకీయంగా దెబ్బతీసే కుట్ర అని ఆరోపిస్తున్నారు. అయితే కేసీఆర్ విచారణకు హాజరై తన వాదనను సమర్థవంతంగా వినిపిస్తారా..? లేక నోట్ ద్వారా సమాధానాలు పంపిస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది. ఈ కమిషన్ నివేదిక రాష్ట్రంలో రాజకీయ చర్చలను మరింత రసవత్తరంగా మార్చనుంది.