కేసీఆర్ దమ్ము కాంగ్రెస్ నేతలకు తెలుసు.. కవిత కీలక వ్యాఖ్యలు

కేసీఆర్ దమ్ము కాంగ్రెస్ నేతలకు తెలుసు.. కవిత కీలక వ్యాఖ్యలు

ఎమ్మెల్సీ (MLC) కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) మరోసారి రాష్ట్ర రాజకీయాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. నేడు ఆమె అబిడ్స్ పోస్ట్ ఆఫీస్ ఎదురుగా కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ (Sonia Gandhi)కి పోస్ట్ కార్డ్ రాశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు, ఆరు గ్యారంటీలపై అసెంబ్లీలో చర్చకు తాము సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు.

కేసీఆర్, రేవంత్ రెడ్డిపై విమర్శలు
“నా కలలో కూడా కేసీఆర్(KCR) తెలంగాణకు నష్టం చేయరు. కేసీఆర్ దమ్ము ఎంతో కాంగ్రెస్ నేతలకు బాగా తెలుసు. అందుకే తెలంగాణ రాష్ట్రం వచ్చింది. కేసీఆర్ తెచ్చిన తెలంగాణకు రేవంత్ రెడ్డి (Revanth Reddy) ముఖ్యమంత్రి అయ్యారు” అని ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యానించారు.

అలాగే, ఏపీ సీఎం(AP CM) చంద్రబాబు (Chandrababu)ను పిలిచి ప్రజాభవన్‌లో హైదరాబాద్ బిర్యానీ తినిపించింది రేవంత్ రెడ్డి అని కవిత ఆరోపించారు. “గోదావరి నీటిని గిఫ్ట్ ప్యాకెట్ కట్టి రేవంత్ చంద్రబాబుకు ఇచ్చారు. కేసీఆర్ హయాంలో బనకచర్ల (Banakacharla)ఊసే లేదు. సీఎం హోదాలో కేసీఆర్ ఎక్కడ సంతకాలు పెట్టలేదు. తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవటానికే కేసీఆర్ పై రేవంత్ వ్యాఖ్యలు చేస్తున్నారని” ఆమె తప్పుబట్టారు.

స్థానిక సంస్థల ఎన్నికలు, బీసీ రిజర్వేషన్లు
స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని కవిత తెలిపారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చి ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. హైకోర్టు ఇచ్చిన సమయం లోపు ప్రభుత్వం ఆర్డర్ ఇచ్చి ఎన్నికలు నిర్వహించుకోవచ్చని ఆమె అన్నారు. 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వకుంటే తెలంగాణ సమాజం కాంగ్రెస్ ను క్షమించదని కవిత హెచ్చరించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment