కావ్యా మారన్ జట్టులో పాక్ క్రికెటర్లు – వివాదంలో SRH ఓనర్..

కావ్యా మారన్ జట్టులో పాక్ క్రికెటర్లు – వివాదంలో SRH ఓనర్..

సన్ రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad) (ఎస్‌ఆర్‌హెచ్) సహ యజమాని కావ్యా మారన్ (Kaviya Maran) మరో క్రికెట్ లీగ్‌తో వార్తల్లో నిలిచారు. ఆమెకు చెందిన సన్ గ్రూప్, ఇంగ్లండ్ (England) వేదికగా జరగబోయే ద హండ్రెడ్ లీగ్లో (The Hundred League) నార్త్రన్ సూపర్ ఛార్జర్స్ (Northern Super Chargers) అనే ఫ్రాంచైజీని రూ. 1,094 కోట్లకు కొనుగోలు చేసింది. అయితే తాజాగా జట్టులో పాకిస్తాన్ మాజీ ఆటగాళ్లను ఎంపిక చేయడంతో సోషల్ మీడియాలో ఆమెపై విమర్శల వర్షం పడుతోంది.

పాక్ క్రికెటర్ల ఎంపికతో వివాదం
ఈ సీజన్‌కు ముందు హండ్రెడ్ లీగ్‌లోని మిగతా ఫ్రాంచైజీలు ఎవ్వరూ పాకిస్తాన్ (Pakistan) ఆటగాళ్లను ఎంపిక చేయలేదు. కానీ నార్త్రన్ సూపర్ ఛార్జర్స్ మాత్రం బెన్ డ్వార్షుయిస్ (ఆస్ట్రేలియా (Australia)), మిచెల్ సాంట్నర్ (న్యూజిలాండ్) స్థానాల్లో మొహమ్మద్ ఆమిర్, ఇమాద్ వసీంలను తీసుకోవడంతో భారత అభిమానులు ఆగ్రహంగా స్పందిస్తున్నారు.

భారత పెట్టుబడిదారుల భిన్న వైఖరి
ఇప్పటికే ఐపీఎల్ యజమానులు అధినేతృత్వం వహిస్తున్న ఇతర లీగ్‌లలో – సౌతాఫ్రికా T20 లీగ్, యుఎస్‌ఎ మేజర్ లీగ్, గ్లోబల్ T20 లీగ్ మొదలైన వాటిలో పాకిస్తాన్ ఆటగాళ్లకు అవకాశం లేదు. పుల్వామా దాడి తర్వాత భారత్ పాక్ సంబంధాలు మరింత విషమించగా, అన్ని క్రీడా విభాగాల్లో పాక్‌కు నిషేధం విధించడం తెలిసిందే.

“పెద్ద తప్పు చేసింది కావ్యా మారన్” – నెటిజన్ల ఆగ్రహం
సోషల్ మీడియాలో భారతీయులు, “ఇప్పటి వరకు ఐపీఎల్ యజమానులు ఎవరూ పాక్ ఆటగాళ్లను తమ జట్లలోకి తీసుకోలేదు. కానీ కావ్యా మారన్ మాత్రం దేశభావాలకు విరుద్ధంగా వ్యవహరించార”ని మండిపడుతున్నారు. నార్త్రన్ సూపర్ ఛార్జర్స్ ప్రస్తుతం ఇంగ్లండ్ ఆటగాడు హ్యారీ బ్రూక్ నేతృత్వంలో ఉంది. జట్టులో డేవిడ్ మిల్లర్, డేవిడ్ మలాన్ వంటి స్టార్ ప్లేయర్లు ఉన్నారు. జట్టు తొలి మ్యాచ్‌ను ఆగస్ట్ 7న ఆడనుంది.

చర్చనీయాంశంగా మారిన ఎంపిక
ఈ నిర్ణయం ఇప్పుడు భారత క్రికెట్ అభిమానులలో అసహనం, సోషల్ మీడియాలో ట్రోలింగ్, మరియు దేశభక్తి వర్సెస్ వ్యాపారం అనే పెద్ద చర్చకు దారితీస్తోంది.
కావ్యా మారన్, ఒక వైపు ఐపీఎల్ ఫ్రాంచైజీకి నాయకత్వం వహిస్తూ, మరోవైపు వ్యాపార విస్తరణ పేరుతో దేశ భావోద్వేగాలను కాదని నిర్ణయాలు తీసుకుంటున్నారనే విమర్శలు వస్తున్నాయి.

Join WhatsApp

Join Now

Leave a Comment