బీఆర్ఎస్ పార్టీ (BRS Party)కి వ్యతిరేకంగా వ్యవహరించిన కారణంగా మాజీ (Former) ముఖ్యమంత్రి (Chief Minister) కేసీఆర్(KCR) తన కుమార్తె కవిత(Kavitha)ను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. దీంతో తన ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో కవిత తాజాగా కొత్త పార్టీ(New Party) ఏర్పాటుపై కీలక వ్యాఖ్యలు చేశారు.
కొత్త పార్టీపై చర్చలు:
కొత్త పార్టీ పెట్టే విషయంపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, తన తండ్రి కేసీఆర్ లాగే వందల మందితో చర్చిస్తున్నానని కవిత చెప్పారు. “తండ్రి పార్టీ నుంచి సస్పెండ్ అయిన మొదటి కూతురిని నేనే” అని ఆమె పేర్కొన్నారు.
హరీష్ రావు, రేవంత్ రెడ్డిపై వ్యాఖ్యలు:
కాళేశ్వరం ప్రాజెక్టు (Kaleshwaram Project) విషయంలో హరీష్ రావు (Harish Rao)పై తప్ప వేరే కోపం లేదని, కాళేశ్వరానికి సంబంధించి ప్రతి నిర్ణయం కేసీఆర్ దేనని హరీష్ రావు పీసీ ఘోష్ కమిషన్ (PC Ghosh Commission)కు చెప్పారని కవిత గుర్తుచేశారు. కాంగ్రెస్ (Congress)లో చేరే ఆలోచన లేదని, సీఎం రేవంత్ రెడ్డి తన పేరును పదే పదే ప్రస్తావించడంపై ఆమె చురక అంటించారు.
భవిష్యత్తు ప్రణాళికలు:
తాను ప్రజలందరి కోసం పనిచేయాలని కోరుకుంటున్నానని, బీసీ సమస్యలు తనకు మనసుకు దగ్గరగా ఉన్నాయని కవిత తెలిపారు. తాను ప్రస్తుతం ‘ఫ్రీ బర్డ్’ (‘Free Bird’) అని, చాలామంది నేతలు తనతో టచ్లో ఉన్నారని ఆమె వెల్లడించారు.








