భారత్-పాక్ (India-Pakistan) మధ్య వివాదాలు చెలరేగిన ప్రతీసారి కరాచీ బేకరీ (Karachi Bakery) పై దాడులు జరగడం కామన్ అయిపోయింది. తాజాగా శంషాబాద్ ప్రాంతంలోని కరాచీ బేకరీపై బీజేపీ కార్యకర్తలు (BJP Workers) దాడికి (Attack) దిగిన ఘటన కలకలం రేపుతోంది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను శంషాబాద్ విమానాశ్రయ (Shamshabad Airport) పోలీస్ స్టేషన్ (Police Station) ఇన్స్పెక్టర్ (Inspector) కె. బాలరాజు (K. Balaraju) వివరించారు. సుమారు 10 నుంచి 15 మంది బీజేపీ కార్యకర్తలు కాషాయ జెండాలు చేతపట్టుకుని “భారత్ మాతా కీ జై”(“Bharat Mata Ki Jai”) నినాదాలతో బేకరీ ఎదుట నిరసన తెలిపారు. బేకరీ బోర్డు (Bakery Board)ను ధ్వంసం చేసేందుకు ప్రయత్నించారు. ఆ సమయంలో వారు కరాచీ బేకరీ మెట్లపై పాకిస్తాన్ జెండా స్టిక్కర్లు అతికించి వాటిని కాలితో తొక్కుతున్న దృశ్యాలు కూడా సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఘటనపై కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. ఈ కేసులో ఎవరినీ అరెస్టు చేయలేదని చెప్పారు.
ఇదే మొదటిసారి కాదు..
ఇది కరాచీ బేకరీపై తొలిసారి జరిగిన దాడి కాదు. 2019లో జరిగిన పుల్వామా ఉగ్రదాడి సమయంలో కూడా ఇదే బేకరీ వద్ద కొందరు ఆందోళనకు దిగిన ఘటనలు గుర్తు చేసుకోవచ్చు. అప్పట్లో కూడా బేకరీ బోర్డును కవర్ చేయాలని ప్రయత్నాలు జరిగాయి.
విశాఖలో..
ఇటీవలి పహల్గాం ఘటన నేపథ్యంగా విశాఖపట్నంలోని వెంకోజీపాలెం ప్రాంతంలో మే 5న జనజాగరణ సమితి నేతృత్వంలో కరాచీ బేకరీ వద్ద నిరసన చేపట్టారు. ‘‘బేకరీ పేరు మార్చకపోతే యజమానులపై దేశద్రోహం కేసులు పెట్టాలి’’ అంటూ డిమాండ్ చేశారు. 10 రోజుల్లో పేరు మార్చకపోతే బేకరీలను తగలబెడతామని హెచ్చరికలు కూడా చేశారు.