“భాష కోసం ప్రాణాలొదిలాం.. మాతో ఆటలొద్దు!” – కేంద్రంపై కమల్‌హాసన్ ఫైర్

"భాష కోసం ప్రాణాలొదిలాం.. మాతో ఆటలొద్దు!" – కేంద్రంపై కమల్‌హాసన్ ఫైర్

తమిళనాడులో జాతీయ విద్యా విధానం (NEP) అమలుపై పెద్ద వివాదం రేగుతోంది. ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయ్యమ్ (MNM) అధినేత కమల్‌హాసన్ (Kamal Haasan) ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వాన్ని తీవ్రంగా హెచ్చరించారు. పార్టీ 8వ స్థాపన దినోత్సవం సందర్భంగా కమల్‌హాసన్ మాట్లాడుతూ, “తమిళులు భాష కోసం ప్రాణాలు వదిలారు. ఈ విషయంలో మాతో ఆటలొద్దు” అంటూ కేంద్రంపై ఘాటుగా స్పందించారు. “మా పిల్లలకు ఏ భాష కావాలో తెలుసు. వారి భవిష్యత్తును నిర్ణయించుకునే జ్ఞానం మా దగ్గర ఉంది. మూడుభాషల విధానాన్ని మాకు రుద్దే ప్రయత్నం అసహనాన్ని కలిగిస్తోంది” అని కమల్ అన్నారు.

తమిళనాడులో రెండు భాషల విధానం అమలులో ఉండగా, NEP కింద హిందీతో కలిపి మూడు భాషల విధానం అమలు చేయాలని కేంద్రం భావిస్తోంది. ఈ నిర్ణయాన్ని తమిళనాడు అధికార పార్టీ DMK తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, NEP అమలు చేయకుంటే తమిళనాడుకు రావాల్సిన రూ.2,152 కోట్లు నిలిపివేస్తామని హెచ్చరించడంతో వివాదం మరింత ముదిరింది.

తమిళనాడు ప్రభుత్వం vs కేంద్రం
ఈ అంశంపై తమిళనాడు సీఎం స్టాలిన్ ఇప్పటికే ప్రధాని మోడీకి లేఖ రాశారు. “రాజకీయాలను వదిలి విద్యార్థుల భవిష్యత్తు కోసం ఆలోచించండి” అంటూ కేంద్రం నుంచి విమర్శలు వస్తున్నాయి. ప్రధాని మోడీ కూడా ఈ వివాదంపై పరోక్షంగా స్పందిస్తూ, “దేశంలో భాషల పట్ల శత్రుత్వం సృష్టించొద్దు” అని సూచించారు. తమిళనాడు భాషా సమస్య జాతీయ స్థాయిలో హాట్ టాపిక్‌గా మారిన ఈ నేపథ్యంలో, NEP అమలు ఏమేరకు ముందుకెళ్తుందో వేచి చూడాలి.

Join WhatsApp

Join Now

Leave a Comment