ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ (KA Paul) డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Deputy CM Pawan Kalyan)పై సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ ఆకలేస్తే బీఫ్ (Beef) తింటాడని స్వయంగా తనతో చెప్పారని ఆయన సంచలన ప్రకటన చేశారు. గురువారం మీడియాతో మాట్లాడిన కేఏ పాల్, పవన్ కళ్యాణ్ తన భార్య, పిల్లలు క్రైస్తవులని (Christians) అనేకసార్లు చెప్పారని గుర్తుచేశారు. ఇంట్లో అమ్మ దీపం వెలిగిస్తే, ఆయన తండ్రి సిగరెట్ వెలిగించుకునేవారని కూడా పవన్ చెప్పినట్లు కేఏపాల్ గుర్తుచేశారు.
ఆంధ్రప్రదేశ్ను మరో ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) లేదా మణిపూర్ (Manipur)లా మారనివ్వబోతుందని స్పష్టం చేసిన కేఏ పాల్, డిప్యూటీ సీఎం స్థాయిలో ఉన్న పవన్ కళ్యాణ్ రెచ్చగొట్టే మాటలు మాట్లాడితే, పాస్టర్లు ఎలా స్పందిస్తారని ప్రశ్నించారు. మత ప్రభోదకుడు పగడాల ప్రవీణ్ (Pagadala Praveen) కుటుంబానికి సీఎం చంద్రబాబు (Chandrababu) న్యాయం చేయాలని డిమాండ్ చేసిన కేఏ పాల్, అలా జరగకపోతే చంద్రబాబు చరిత్రలో చెత్త వ్యక్తిగా మిగిలిపోతారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.